Calcium Deficiency: వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.. మన శరీరంలో కాల్షియం లోపం కారణంగా నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వేధిస్తున్నాయి.. ఒక గ్లాసు ఈ పాలు వారంలో మూడు రోజులు పాటు తాగితే.. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ వంటింటి చిట్కా చాలు..
ఈ చిట్కా కోసం..
2 స్పూన్స్ గసగసాలు, 2 స్పూన్స్ సొంపు గింజల పొడి, 2 స్పూన్స్ పటిక బెల్లం పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, ఒక గ్లాసు పాలు అవసరం. ముందుగా ఒక బాండి తీసుకుని అందులో ఒక చెంచా నెయ్యి వేసి అందులో గసగసాలు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు పాలు పోసి కాగనివ్వాలి. తాగిన తర్వాత ఒక చెంచా సోంపు గింజల పొడి, కొబ్బరి పొడి, పటికబెల్లం వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తరువాత మరొక గ్లాసు లోకి తీసుకోవాలి.
గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాలను రాత్రి నిద్రపోయే పది నిమిషాలు ముందు తాగాలి. ఈ పాలు తాగితే నడుము నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల వాపులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. ఇలా ఈ పాలను రాత్రిపూట తాగడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం లభిస్తుంది. ఎముకలను బలంగా, దృఢంగా ఉంచుతుంది. నొప్పులను తగ్గించడం తో పాటు శాశ్వత ఉపశమనాన్ని అందిస్తుంది.