Calcium Deficiency: క్యాల్షియం లోపంతో ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఎముకల బలహీనత, ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, నరాల శిరలలో అడ్డంకులు ఈ సమస్యలన్నింటికీ మూల కారణం కాల్షియం లోపం.. ఈ సమస్యను అధిగమించడానికి ఈ మూడు పదార్థాలు కలిపి తీసుకుంటే చాలు..!!
ఈ చిట్కా కోసం 3 వాల్ నట్స్, రెండు చెంచాలు తెల్ల నువ్వులు, రెండు చెంచాలు అవిస గింజలు అవసరం. ఒక బాండి తీసుకుని ఈ మూడు పదార్థాలను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మూడింటిని ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడి ఎలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడిని కలిపి తాగాలి.
ప్రతిరోజు రాత్రి ఈ పొడి కలిపిన నీటిని తాగుతూ ఉంటే అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది. కీళ్లు, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఎముకలలో గుజ్జు వచ్చేలా చేస్తుంది. తల నొప్పిని తగ్గిస్తుంది. క్యాల్షియం లోపం తో బాధపడేవారికి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి రోజూ ఒక చెంచా పొడిని తీసుకునేవారు ఒక క్యాల్షియం టాబ్లెట్ వేసుకునే దానితో సమానం. ఈ పొడి తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.