ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) కరెన్సీ నోట్లు , నాణేల ద్వారా కరోనా వ్యాపించదని స్పష్టం చేసింది . న్యూస్ పేపర్ ద్వారా కూడా వైరస్ రాదని వెల్లడించింది .
అయితే , ఇటీవల కొందరు కరెన్సీ నోట్లకు లాలాజలాన్ని అంటించి రోడ్లపై పడేస్తున్నారు. ఈ కారణం గా కరెన్సీ నోట్లతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది . కొన్ని చిట్కాలు పాటించటం వలన కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడవచ్చు .
కరెన్సీ నోట్లను ముట్టుకున్నా చేతులతో ముఖం ,కళ్ళు , నోటిని ముట్టుకోకూడకు . నోట్లు తీసుకున్న తర్వాత చేతులను వెంటనే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి . డెబిట్ , క్రిడిట్ కార్డులను ముట్టుకున్నా తర్వాత కూడా తప్పకుండా చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోండి . కరెన్సీ నోట్లను ముట్టుకున్న చేతులతో ముఖం , కళ్ళు ,నోటిని ముట్టుకోకూడదు. నోట్లను తీసుకున్న తర్వాత చేతులను వెంటనే శానిటైజర్ తో శుభ్రం చేసుకోండి . ఏటీ ఎం లోని బటన్స్ టూత్ పిక్ తో నొక్కండి.డబ్బులు డ్రా చేశాక ఆ టూత్ పిక్ పడేయండి.ఏటీ ఎం లో డోర్ తెరిచి, ముసిన తర్వాత కూడా చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.
వీలైనంత వరకు డిజిటల్, ఆన్ లైన్ లావాదేవీలు చేయటమే ఉత్తమం.చెక్ బుక్ లు తాకిన తర్వాత కూడా చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోండి.అత్యవసరమైతే తప్పా బ్యాంకులకు వెళ్లొద్దు.బ్యాంకులకు ఎక్కువ సంఖ్యలో ఖాతా దారులు వస్తుంటారు.దీని వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందవచ్చు.