కరోనా ధాటికి పోలీసులకు మతులు పోతున్నాయి.ఎప్పుడా మహమ్మారి తమకు సోకుతుందా అని వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
విధులు నిర్వర్తిస్తే కరోనా.. నిర్వహించకుంటే క్రమశిక్షణారాహిత్యం… ఇలా పోలీసుల పని ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది.తప్పనిసరిగా డ్యూటీ చేస్తే కరోనా అంటుకుని తీరుతోంది.
తాజాగా ఓ అత్యాచారం కేసు నిందితుడిని అరెస్టు చేయడంతో ఏకంగా 60 మంది పోలీసులు క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళపై లైంగిక దాడి చేయడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు నలుగురు పోలీసులు మైసూరు కు వెళ్లి, అక్కడ అతన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. ఆ తర్వాత ఆయనని రిమాండ్ కు తరలించారు
నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. సదరు వ్యక్తిని రిమాండ్ కు తరలించే సమయంలో అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జైలు అధికారులు మైసూర్ నుంచి అతడిని తీసుకువచ్చిన పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆ నలుగురు తోపాటు వారితో కలిసి పనిచేస్తున్న 60 మంది పోలీసులకు హోమ్ క్వారంటైన్ కు వెళ్లాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీనితోపాటు వారు పనిచేసే పోలీస్ స్టేషన్ కు సీల్ వేశారు కూడా.ఆంధ్రప్రదేశ్ లో కూడా రెడ్ జోన్ పరిధిలోకి రావడంతో చీరాల వెంకటగిరి తదితర పోలీసు స్టేషన్లన్నీ మూత పడడం తెలిసిందే.ఏదేమైనా పోలీసుల పని కరోనాకు చెలగాటం ప్రాణాలకు సంకటం అన్నట్టుగా ఉంది.