ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధ పడుతున్న సమస్య ఉబాకయం.. చపాతీలు తింటే త్వరగా బరువు తగ్గుతారన్న విషయం తెలిసిందే.. కానీ చపాతీలు తిన్నా కొంతమంది బరువు దగ్గర కానీ చపాతీ పిండిలో మాత్రం ఈ ఒక్క పిండి కలుపుకుంటే మాత్రం బరువు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇంతకీ ఆ పిండి ఏంటంటే.!?
సత్తు పిండి మనలో ఈ పిండి గురించి ఎక్కువమందికి తెలియకపోయినా మన పెద్దలకు తెలిసే ఉంటుంది.. శనగపప్పు, బార్లీ గింజలతో ఈ సత్తు పొడిని తయారు చేస్తారు.. కొంతమంది బాదం, జీడిపప్పు, బార్లీ, కొమ్ము శనగలను వేయించి దంచి పొడి చేస్తారు.. ఈ పొడిని ఉత్తర భారత దేశంలో ఎక్కువగా వాడుతారు. మనకి కూడా ఈ పిండి ఈ కామర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఈ పిండిలో ప్రోటీన్ ఫైబర్, మెగ్నీషియం, సోడియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.. గోధుమ పిండిలో ఈ పొడిని కలిపి చపాతీలు చేసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. త్వరగా ఆకలి వేయదు.. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుతుంది..
రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు సత్తుపిండిని కలిపి పిండిని కలుపుకోవాలి.. ఈ పిండితో పరోటా, చపాతీలు చేసుకోవాలి.. ఈ వీటిని నూనె లేకుండా కాల్చుకుని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏ కూరతో తిన్నా కూడా ఈ చపాతీలు రుచికరంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఏ చపాతీలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దాంతో త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?