children: ఈ రోజుల్లో చాలా మంది ఇరవై ఏళ్లకే బీపీ , షుగరు అనే జంట భూతాల బారిన పడిపోతున్నటుగా డాక్టర్స్ తెలియచేస్తున్నారు.. ఆస్పత్రిలో కిడ్నీ,గుండె వంటి సమస్యలకు చికిత్స తీసుకుంటున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులు కారణమని తెలుస్తోంది. చిన్నవయసులోనే వస్తున్నా ఈ ఆరోగ్య సమస్యల తో జాగ్రత్తగా ఉండకపోతే రాబోయే రోజుల్లో మానవ జీవితం పది నుంచి పదిహేనేళ్లు తగ్గిపోయే ప్రమాదం దాగి ఉన్నట్లు నిపుణులు తెలియచేస్తున్నారు.ప్రభుత్వం చేపట్టిన ఒక సర్వేలో సైతం షుగర్ , బీపీ వలన గుండె జబ్బులు పెరుగుతున్నట్లు బయట పడింది. 25 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో 12 శాతం మంది షుగర్ తో 14 శాతం మంది బీపీ బారిన పడినట్లు సర్వేలో తేలింది.
ఈ రెండు వ్యాధులు రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఇవే ప్పటి జీవన విధానం లో వచ్చిన మార్పులు విచ్చలవిడిగా మాంసాహారం తీసుకోవడం, జంక్ఫుడ్స్ ఎక్కువగా తినడం, శారీరక పరమైన శ్రమ లేకపోవడం ముఖ్య కారణాలు గా తెలుస్తుంది . వీటితో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం కూడా రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణంగా సర్వే లో బయట పడింది. ఉద్యోగం చేసే వారిలో 70 శాతం మంది ఒత్తిడిని ఎదురుకోవడం కూడా చిన్నవయసులోనే బీపీ,షుగర్ రావడానికి కారణాలు గా తెలుస్తుంది.
వాటి పరిష్కారాలు తెలుసుకుందాం..
ఈ రెండు ఆరోగ్య సమస్యల ను తప్పించుకోవాలంటే వారంలో ఐదు రోజులు 45 నిమిషాల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పని సరిగా జీవితం లో భాగం కావలి. జాబ్ లో , జీవితంలో ఉండే ఒత్తిళ్లను యోగా చేయడం తో పోగొట్టుకోవాలి.మాంసాహారం, జంక్ఫుడ్స్ను ఎంత తగ్గించ గలిగితే అంత మంచిది అని గుర్తు పెట్టుకోండి. పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆహారం, తాజా పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. వీటితో పాటు ఒక మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనె వాడకూడదు అని నియమం పెట్టుకోవాలి. ఒకే రకం నూనె వాడకం కాకుండా మార్చి మార్చి వాడటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.