కరోనా వల్ల విద్యార్థుల చదువులకు ఏడు నెలల నుంచి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. ఇప్పటికీ వాక్సిన్ రాలేదు. ఎప్పుడొస్తుందో తెలియని వాక్సిన్ కోసం పిల్లల చదువులను ఆగం చేయొద్దని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అందుకు గాను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను రీ ఓపెన్ చేసేందుకు అనుమతులను ఇస్తున్నాయి. అయితే ఈ కరోనా టైంలో ప్రభుత్వాలు పాఠశాలలను, కాలేజీలను తెరిచేందుకు అనుమతులను ఇవ్వకపోవడమే మంచిదని పలువురు డాక్టర్లు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో స్కూల్ తెరిచిన మొదటిరోజే 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో అంతా సమస్యల్లో పడ్డట్లు అయింది. దాంతో ఆ రోజు స్కూల్ కు వచ్చిన 15 మంది విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ కు పంపించాల్సి వచ్చింది. అలాగే స్కూల్ ను మూడు రోజులు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దాంతో పాటు పాఠశాల మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు.
కరోనా లాక్డౌన్ వల్ల 7 నెలల తర్వాత పలు రాష్ట్రాల్లో స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. ఇలాగే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా 10 నుంచి 12వ తరగతి స్టూడెంట్ల కోసం విద్యాసంస్థలను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో నవంబర్ 2 నుంచి పలు పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. ఇలా డెహ్రాడూన్లో తెరుచుకున్న ఒక స్కూల్లో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అలా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే రాణికేత్కు చెందిన ఒక స్టూడెంట్ కు తన తండ్రి నుంచి కాల్ వచ్చింది.వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి కరోనా వచ్చిందని అలర్ట్ చేశారు. దాంతో ఆ స్టూడెంట్ కు పరీక్షలు నిర్వహిస్తే.. అతనికి పాజిటివ్ గా తేలింది. కరోనా వచ్చిన వ్యక్తిని కలవడం వల్ల వారికి సోకిట్లు ఆ స్టూడెంట్ తండ్రి చెప్పాడు.
ఇలా మెదటిరోజే స్టూడెంట్ కు కరోనా సోకడంతో స్కూల్ యాజమాన్యం బాధపడ్డారు. అన్ని చర్యలు తీసుకున్నా.. ఇలా జరగడం దురదృష్టకరమని యాజమాన్యం తెలిపింది. కరోనా సోకిన విద్యార్థితో ఉన్న 15 మంది స్టూడెంట్ల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు యాజమాన్యం తెలిపింది. అలాగే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తగిన జాగ్రతలను తీసుకోవాలసి సూచించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సోమవారం నుంచి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నారు. అలా అంగీకార పత్రం ఇచ్చిన పిల్లలనే పాఠశాలకు రానిస్తున్నారు. కానీ ఈ పత్రంలో విద్యార్థికి కరోనా సోకితే స్కూలు యాజమాన్యానికి ఎలాంటి బాధ్యత లేదు అంటూ సూటిగా చెబుతున్నారు. మీ పిల్లలకు మేము భరోసా అనాల్సింది పోయి.. ఇలా మాట్లాడటం ఏంటని పలువురు యాజమన్యాల తీరును నిరసిస్తున్నారు.