ఆకలి.. అనేది ప్రతి జీవికి సామాన్యమే.అయినా కూడా దానిప్రభవం చెప్పలేనిది . అది తీరక పొతే ఏ ప్రాణి అయినా విలవిలలాడుతుంది. అందుకే నేమో యుద్ధం కన్నా ఆకలి ఎక్కువ విలయం సృష్టిస్తుందని అంటారు. జానెడు పొట్ట నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతూ ఉంటారు. అయితే ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది. అదే ఆకలి లేనప్పుడు తింటే అనారోగాన్ని చేతులారా పాడు చేసుకునట్టే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సాధారణంగా కొందరు నోటికి రుచిగా ఉండే ఫుడ్ను ఆకలి లేకుండానే లాగించేస్తారు.మరికొందరు తినేస్తే ఒక పనైపోతుందా కదా అని ఆకలి లేకుండానే తింటారు. మరికొందరు ఏమి తోచక పోయిన తినేస్తూ ఉంటారు. ఇలా ఆకలిగా లేనప్పుడు ఆహారం తీసుకుంటేఅనారోగ్య సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. అలా తినడం వల్ల మన శరీరం జీర్ణించుకోలేదని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి . ఇలా తినడం వలన బ్లడ్ లో గ్లూకోజ్ శాతం పెరుగుతుందిఅని హెచ్చరిస్తున్నారు.
అంతే కాకుండా రోజుకు మూడు పూటలు మాత్రమే ఆహారం తీసుకోవాలని అదికూడా ఆకలివేసినప్పుడే తీసుకోవాలని వైద్యులుచెప్పే మాట. అల్పాహారం, మధ్యాహ్న భోజనం రాత్రిపూట తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. ఇక ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం వలన జీర్ణక్రియకు హాని కలగడం తో పాటుగా ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి ఇలా అనేక సమస్యలు వస్తాయి. ఇలా ఆహారం తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అదే సయయంలో అధిక బరువుతో లావుగా కూడా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .
ఈ పరిస్థితులను వ్యాయామాలు, ఆహార ప్రణాళికలు కూడా సరి చేయలేవట. అందుకే ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలని.. అలా చేయడం వలన ఆరోగ్యానికి మంచిది మరియు బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.