పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లను బట్టి చాల మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కాలంలో చాలా మంది వచ్చే సమస్య కిడ్నీ సంబంధిత సమస్యలు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే ఈ కషాయం తాగితే మంచిదంటున్నారు నిపుణులు. ఈ కషాయాన్ని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్ లేదా కిడ్నీలు దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్ లెవల్ పెరగడం మరియు కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే కొత్తిమీర కషాయం తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తాజాగా ఉన్న కొత్తిమీర ఆకులను ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత రెండు గ్లాసుల మంచినీటిలో కలుపుకోని బాగా మరిగించాలి. నీటి రంగు మారిన తర్వాత నీటిని గోరు వెచ్చగా చల్లార్చుకోవాలి. ఆ నీటిని రోజు ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. ఆలా నెల రోజులు తాగిన అనంతరం ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగాలి. ఇలా చేయండం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతే గ్యాస్టిక్ సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఈ కషాయాన్ని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాదు గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుంది. చర్మాన్ని కూడా త్వరగా ముడుతలు రాకుండా మృదువుగా తయారు చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తినిపెండమే కాకుండా జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది. ఈ కాషాయం రోజు తాగడం ద్వారా బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. దృష్టి లోప సమస్యలు ఉన్న వారు ఈ కాషాయం తాగడం ద్వారా కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.