కరోనా రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు.. దీని భారిన పడి చాలా మంది బలవుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే కరోనా రాకతో చాలా మంది లాభార్జన చేస్తున్నారు. జనాలను నిలువునా ముంచుతూ దర్జాగా జీవిస్తున్నారు. కరోనా సోకకుండా డాక్టర్లు రకరకాల సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే..కాగా మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ లకు కరోనా కాలంగా చాలా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే కేవలం..రూ.2500 కరోనా నెగిటీవ్ ఫేక్ సర్టిఫికేట్లు అమ్ముతున్నారు కొందరు దుండగులు.
కొందరూ దోపిడీదారులు అడ్డదారుల్లో నడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నలికీ శానిటైజర్లు, మాస్కులు, ఎక్కువ రేటుకు ఇల్లీగల్ గా ఆక్సిజన్ ను విక్రయిస్తున్నారు. ఈ వార్తలు మనం టీవీల్లో చూసినవే.. కాగా కొన్ని హాస్పటల్లు మరీ దారుణంగా తయారయ్యారు. ప్రాణాలను కాపాడాల్సిన ఆస్పత్రులే శవాల మీద పెలాలు ఏరుకునే వాటిలా తయారయ్యాయి. కరోనా పాజిటీవ్ తో ఆస్పత్రిలో జాయిన్ అయినా వారి దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే రోగి పరిస్థితి క్రిటికల్ గా ఉండి చనిపోయినా బతికున్నాడంటూ డబ్బలు వసూలు చేస్తాయి. మొత్తం పే చేసిందాకా శవాన్ని బయటకు కూడా పంపించని ఆస్పత్రులు కోకొల్లలు. ఇది ఒక నయా దందలా తయారైంది. ఆస్పటల్ల పేరిట పెద్ద మాఫియానే జరుగుతుందంటే నమ్మండి..
ఇదిలా ఉండగా కొందరు క్వారంటైన్ బయపడి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి శుభవార్తలు చేరవేస్తున్నాయి కొన్ని ఆస్పత్రులు. కోవిడ్ వచ్చినా మా దగ్గర నెగిటీవ్ రిపోర్టులు ఇస్తామంటూ కొన్ని హాస్పత్రులు నయా దందాకు తెరలేపాయి. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ పాజిటీవ్ వచ్చినా డబ్బులకు కక్కుర్తి పడి నెగిటీవ్ రిపోర్టులను క్రియేట్ చేసి డబ్బుల దందాను నిర్వహిస్తున్నాయి. ఇది కర్నాటకలోని బెంగళూరు నగరంలో పలు ఆస్పత్రులు కరోనా టెస్టుల పేరుతో ఈ దోపిడికి పాల్పడుతున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కరోనా టెస్టులు తప్పనిసరిగా అవసరం ఏర్పడింది.. ఇంకేముందు ఈ నయా దందాతో ఆస్పత్రులు తమ ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో మీకు కరోనా పాజిటీవ్ వస్తుందనే భయం కూడా లేదు. కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ మే హూనా అంటూ నెగిటీవ్ చేసే సత్తా వాళ్లకుంది. ఇందుకోసం కేవలం 2500 రూపాయలు ఇస్తే చాలా మీకు నెగిటీవే వస్తుందని డబ్బులు దండుకుంటాయి కొన్ని ఆస్పత్రులు.
బెంగళూరు సిటీలో ఇప్పటికే భారీగా తప్పుడు అడ్రస్, ఫేక్ ఫోన్ నెంబర్లతో కూడా సర్టిఫికేట్లు జారీ చేశారని సమాచారం. మరి ఈ సర్టిఫికేట్లు పట్టుకుని విచ్చలవిడిగా సంచరించి ఇతరులకు వైరస్ అంటిస్తే పరిస్ధితులు ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. ఈ నకిలీ రిపోర్టులతో బయటకు వెళ్లే వారు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటుంది. ఈ దందాల మూలంగా కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి.