గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేయడం కోసం విశ్వప్రయత్నాలను సాగిస్తూన్నాయి. ఎంతో మంది దీని భారిన పడుతున్నారు. కరోనా రాకతో దేశాల ఆర్ధిక పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. దీంతో కొన్ని నెలలుగా స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, హోటళ్లు అన్నింటినీ మూతబడేలా చేసింది. అయినా కరోనా తగ్గుముకం పడుతుందా అంటే అదీ లేదు. ఎంతో మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితికి తెచ్చిది ఈ కరోనా మహమ్మారి..
ఇదిలా ఉంటే కరోనా గురించి లోతుగా తెలుసుకుంటున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. జ్వరం వస్తే కరోనా వచ్చినట్టు అని అనుమానించాలని తెలిపిన నిపుణులు తాజాగా రకరకాల కొత్త లక్షణాలలో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. జ్వరం రావడం, దగ్గు, జలుబు, కళ్లు ఎర్రగా మారడం, కాళ్లపై ఎర్రటి చారలు ఏర్పడం, తరచూ జ్వరం రావడం వంటివి కరోనా లక్షణాలుగా వైద్యులు తెలిపారు. కాని ఈ లక్షణాలు అందరిలో కనిపించకపోవచ్చని తెలిపారు. చాలా మందికి కరోనా వచ్చి పోయిన సంగతి కూడా తెలియలేదని నిపుణులు వెళ్లడించారు.
కాగా కరోనా లక్షణాల గురించి మళ్లీ ఓ కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. సీజనల్ గా వ్యాదులు ప్రభలుతూనే ఉంటాయి. ఈ సీజనల్ వ్యాదులనే చాలా సాదారణం. కాని కరోనా ఇన్ఫెక్షన్ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశముందని బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్ లే అంటున్నారు. ప్రతి ఏడాది చలికాలికాలంలో వచ్చే జలుబు, దగ్గులు కరోనా వైరస్ కు దారితీస్తుందని తెలిపారు. అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతుంటాయని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తున్న కరోనా వైరస్ రకానికీ మనిషి శరీరం.. అదే విధంగా స్పందించే అవకాశముందని బార్క్ లే తెలిపారు.
ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఆధ్వర్యంలో బ్రిటన్ లోని 3.65 లక్షల మందికి పైగా ప్రజలకు నిర్వహించిన ఫింగ్ ప్రిక్ యాంటీబాడీ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్టు ఆమె తెలిపారు. అయితే ఈ టెస్టులు చేయించుకున్న వారిలో అధిక మందికి కరోనాను జయించే యాంటిబాడీలు కొన్ని నెలల పాటే క్రియాశీలంగా ఉంటాయని గుర్తిచారు. అలాగే ఈ టెస్టుల్లో పాజిటీవ్ వచ్చిన వారిలో జూన్ నుంచి సెప్టేంబర్ మధ్యకాలంలో యాంటీబాడీలు 26 శాతం తగ్గిపోయాయని తెలిపారు. అలాగే 75 ఏండ్లకు పైబడిన వారిలో యాంటీబాడీల క్షీణత అధికంగా ఉన్నట్లు తేలింది.