మంచి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటాము. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తినడం అస్సలు మంచిది కాదు. టైమ్ ప్రకారం ఆహారం తీసుకోవాలి. అది కూడా మంచి పోషకాహారం తీసుకోవాలి. మంచి ఆహారం మాత్రమే.. మనిషి కి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు . అందుకే సరిగ్గా తినడం అలవాటు చేసుకోవాలి.
ప్రతి మనిషి క్రమం తప్పకుండా అల్పాహారం , మధ్యాహ్నభోజనం , రాత్రి భోజనం లేదా టిఫిన్ చేస్తుంటారు. ఇది కూడాసమయం ప్రకారమేతినాలి .ప్రతి ఒక్కరి కి అల్పాహారం అనేది చాలా ముఖ్యం. దీనిని టైమ్ ప్రకారం చేయాలి అస్సలు మానేయకూడదు. ఎందుకంటే రాత్రి నుండి మరల ఉదయం వరకూ ఖాళీ కడుపు తో ఉంటారు. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలి అలా చేస్తేనే మెదడు చురుకుగా పనిచేసి రోజంతా ఉత్సహం గా ఉండగలుగుతారు. బ్రేక్ ఫాస్ట్ లో మంచి పోషకాహారం ఉండే లా చూసుకోవాలి. ఉదయం 9 గంటల లోపే తినడం పూర్తి చేయాలి.
అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంటలోపు భోజనం పూర్తి చేయాలి . బ్రేక్ఫాస్ట్, కి లంచ్కి మధ్య కనీసం 4 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి . ఇక రాత్రి భోజనము విషయానికొస్తే..మధ్యాహ్నం భోజనానికి , రాత్రి భోజనానికి మధ్య కనీసం మూడు గంటల సమయం ఉండాలి. అందుకే 7 గంటల కు భోజనం పూర్తి చేయాలి . ఇంకా అంతకన్నా ఆలస్యం చేయకూడదు. రాత్రి10 దాటినతర్వాత తర్వాత భోజనం చేయకుండా ఉండడం మంచిది.
రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేయడం మంచిది కాదు , దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావడం తో పాటు బరువు పెరుగుతారు. మంచి నిద్రకూడా రాదు అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కారణం వలన రాత్రి భోజనం ఆలస్యమయితే ఏదైనా పండుతి ని ఒక గ్లాస్ మజ్జిగ లేదా పాలు తాగి పడుకోండి.