Cracked Heels: ఎవరైనా ముఖం మీద ఉన్న తీసుకున్న శ్రద్ధ పాదాలపై చూపించరు.. మీ ముఖం ఎంత అందంగా ఉన్నా కూడా పాదాలు పగిలిపోయి నిర్జీవంగా ఉంటే చూడటానికి బాగోవు.. పాదాల పగుళ్ల నుంచి విముక్తి పొందటంతో పాటు పాదాలు మృదువుగా మారే సింపుల్ టిప్స్ పాటించండి..
పాదాలు అందంగా కనిపించడానికి ముందుగా ఒక టబ్ లో కాళ్లు మునిగే వరకు వేడి నీళ్లు పోయాలి. అందుకో నాలుగు గ్రీన్ టీ బ్యాగ్స్ వేయాలి. ఈ లోపు మీరు మీ పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు గ్రీన్ టీ లో రాళ్ల ఉప్పు లో వేయాలి ఇలా గ్రీన్ టీ లో రాళ్ల ఉప్పు వేయడం వలన మరింత ఎఫెక్టివ్ గా ఫలితాలు కనిపిస్తాయి. ఇలా సిద్ధం చేసుకున్న గ్రీన్ టీ లో మీ పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత యు మిస్ స్టోన్ తో బాగా రుద్దాలి దాంతో చర్మం పై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఆ తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పాదాలకు నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకుంటే పగుళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.
ఇలా వారంలో ఒకసారి లేదంటే కనీసం నెలలో రెండు సార్లు అయినా చేస్తుంటే పాదాల పగుళ్లు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పాదాలు మృదువుగా మారతాయి. పాదాల పగుళ్లకు చెక్ పెట్టడంలో గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడుతుంది. గ్రీన్ టీ లో ఉప్పు కలపడం వలన పాదాల లో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి పాదాలు మృదువుగా మారతాయి.