Weight Loss: ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చుని ఉండడం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.. దాంతో బరువు పెరుగుతున్నారు.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా కూడా బరువు పెరుగుతున్నారు.. కారణాలు ఏమైనప్పటికీ బరువు తగ్గడానికి మాత్రం చాలా శ్రమ పడాల్సి వస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సింపుల్ టిప్ తో సులువుగా బరువు తగ్గొచ్చు..! అదెలాగంటే..!?
మన వంటలకు కరివేపాకు విడదీయరాని బంధం ఉంటుంది.. కానీ కరివేపాకు మనం తినకుండా తీసి పక్కన పడేస్తే ఉంటాము.. ఒక ఐదు కరివేపాకు రెబ్బలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా తరగాలి. ఉదయం పరగడుపున కరివేపాకు అల్లం రెండింటినీ కలిపి తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా వరుసగా 15 రోజులపాటు చేస్తే శరీరంలో కొవ్వు కరగడం మీరే గమనిస్తారు. దాంతో సులువుగా బరువు తగ్గుతారు..
లేదంటే ఒక బాండి తీసుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఇందులో కరివేపాకు రెబ్బలు అల్లం ముక్క వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తరువాత మరో ఐదు నిమిషాల పాటు దానిపైన మూత అలాగే ఉంచాలి. తరువాత ఈ నీటిని వడపోసుకొని కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కరివేపాకు టీ ని తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోయి త్వరగా బరువు తగ్గుతారు. ఈ రెండు పద్ధతులలో మీకు నచ్చిన విధంగా ఫాలో అయితే బరువు తగ్గటం తేలికే.