water millon: పుచ్చకాయ అంటే మనకి ఎరుపు రంగు గుర్తుకు వస్తుంది. ఆ కలర్ మాత్రం తగ్గినా తినబుద్ధి కాదు. అయితే ఇప్పుడు కర్ణాటక,బెంగళూరు శివార్లలో అంటే… చిక్ బళ్లాపూర్, కంబాల గోడు,రామనగర రైతులు… ప్రత్యేకమైన పుచ్చకాయ లు సాగు చేపట్టారు. వాటిని పసుపు పుచ్చకాయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ పుచ్చకాయలు బెంగళూరులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి . ఇంకా చెప్పాలంటే ప్రజలు ఇవే కావాలని అడిగి మరీ కొనుక్కుని తినటానికి మక్కువ చూపుతున్నారు.
పుచ్చకాయ పైకి చూడటానికి పచ్చగానే ఉంటుంది…. కోసినప్పుడు ఎరుపు రంగు కాకుండా, పసుపు రంగు లో ఉంటుంది. ఎరుపు కాయలతో పోల్చి చూస్తే , పసుపు కాయల్లో గింజలు చాలా తక్కువగా ఉంటున్నాయి.ఈ కారణం తో కొనుక్కునే వారు ఇవే కావాలని కొంటున్నారు.పసుపు రంగువి కావడంతో,పంట వస్తుందో రాదో, పుచ్చకాయ లు కాస్తాయో లేదో అని సందేహ పడ్డారు రైతులు .అయితే ఈ పంట బాగా పండింది.కొన్ని రోజుల కిందట ఈ పుచ్చకాయల్ని మొదటిసారి చూసిన కొనుగోలు దారులు పసుపు కాయలని వద్దొద్దు ,అంటూ రెడ్ కలర్వే కొనుక్కున్నారు. ఆ తర్వాత అసలు ఎలా ఉంటాయో చూద్దామని ఒక్కొక్కరుగా వీటిని కొనడం మొదలు పెట్టారు. అంతే ఇక ఇప్పుడు వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ పుచ్చకాయ ధర కూడా తక్కువే. కేజీ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. అందువల్ల కొనేవారు కూడా బేరం ఆడకుండా కొనుక్కుంటున్నారు. ఎరుపు రంగు పుచ్చకాయ కంటే,పసుపు రంగు వి కాస్త ఎక్కువ తియ్యగా ఉంటున్నాయి. సలాడ్, జ్యూస్ చేయడానికి ఇవి బాగున్నాయి అని అంటున్నారు. జపాన్ ప్రజలు ఈ పుచ్చకాయలు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ సంవత్సరం భారత దేశం లో ఇవి అందరికీ కొత్తగా అనిపిస్తాయి.
రైతులు కూడా ఈ పంట ను పండించేందుకు ధైర్యం చేయలేక పోతున్నారు.అయితే వచ్చే సంవత్సరానికి ఇవి అందరి గుర్తింపుకి వచ్చేస్తాయి . అందువల్ల రైతులు కూడా వీటిని పండించటానికి ముందుకు వస్తారు . గింజలు తక్కువ, రుచి ఎక్కువ కాబట్టి… ఎర్రని పుచ్చకాయ కన్నా. వీటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటున్నారు .
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?