పంటి నొప్పి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పంటి నొప్పి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఏ నొప్పి అయినా భరించవచ్చు కానీ పంటి నొప్పిని మాత్రం అసలు తట్టుకోలేము.పుచ్చు పళ్ళు ఉన్నవాళ్ళకి పంటి నొప్పి రావడం సహజం. తీపి పదార్ధాలు తిన్నప్పుడు పంటి నొప్పి. బాగా వస్తుంది. ఆ నొప్పిని భరించలేక నొప్పుల బిళ్ళలు. వేయడమో లేక ఏవైనా ఇంటి చిట్కాలు పాటించడమో చేస్తూ ఉంటాము. అయితే పంటి నొప్పి తగ్గడానికి మేము చెప్పే ఈ అద్భుత చిట్కాలను పాటించి చుడండి.వెంటనే మీకు పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లవంగం నూనె :
లవంగం గురించి మన అందరికీ తెలిసిందే. మన. వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యల్లో లవంగం. కూడా ఒకటి.తినే ఆహార పదార్ధాలకు రుచిని,గాటుదనం ఇవ్వడానికి లవంగాన్ని వినియోగిస్తుంటారు. అయితే పంటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే అందుకు కూడా లవంగాలు బాగా పనిచేస్తాయి. పంటి నొప్పి పంటి దగ్గర కొద్దిగా లవంగాల నూనెను దూది సహాయంతో రాసుకోవాలి.లవంగం నూనె అందుబాటులో లేకపోతే నేరుగా లవంగాన్ని అయిన నొప్పి ఉన్న పంటి కింద పెట్టుకుంటే మంచి ఫలితముంటుంది.
వెల్లుల్లి :
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి పంటి సమస్యలు ఉన్నవారికి వెల్లుల్లి వాడితే పంటి సమస్యలు దూరమవుతాయి.వెల్లుల్లి వాడితే పంటి సమస్యలు దూరమవుతాయి. వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా మెత్తగా చేసుకుని పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. అలా వెల్లుల్లి. పేస్ట్ ను పూయడం వలన పంటిలో ఎమన్నా కీటకాలు ఉంటే అవి చనిపోయి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఐస్ తెరపి :
కొద్దిగా ఐస్ ముక్కలను ఒక శుభ్రమైన వస్త్రంలోకి తీసుకుని తీసుకుని దవడ దగ్గర పెట్టుకుని కాపరం పెడుతూ ఉండాలి. పంటి నొప్పి భరించలేనంతంగా ఉన్నప్పుడు ఇలా ఐస్ తెరపి చేయడం ద్వారా పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
జామకాయ ఆకులు :
మన అందరికి జామచెట్టు గురించి బాగా తెలిసే ఉంటుంది. జామకాయలు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో అలాగే జామ చెట్టు ఆకులు కూడా ఆరోగ్యానికి అంతే మంచి చేస్తాయి.పంటి నొప్పులున్నప్పుడు లేత జామాకులు నాలుగింటిని బాగా నమిలి తింటే చాలావరకూ పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.పళ్ళు నొప్పులు ఉన్నవాళ్లు తీపి పదార్ధాలకు దూరంగా ఉంటే బెటర్ అలాగే రాత్రి పూట పడుకునే ముందు కూడా ఒకసారి బ్రష్ చేసుకుని పడుకుంటే నోటిలో సూక్ష్మజీవులు ఎమన్నా ఉంటే చనిపోతాయి.