పుట్టే బిడ్డ ఆడ పిల్లా , లేక మగపిల్లాడా అనే విషయం తెలుసుకోవాలని చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తారు. సాధారణంగా గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడ బిడ్డ అనేది 19 లేదా 20 వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ ఆరో వారం నుంచి ఎదుగుదల, అవయవాల్లో చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. 9 వ వారంలో మగ, ఆడ లింగ నిర్ధారణ అవయవాలు అభివృద్ధి జరుగుతుంది. 20 వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి లింగ నిర్ధారణకు సంబంధించిన అవయవాలు ఏర్పడతాయి.
కొంతమంది అయితే ఆడపిల్ల పుట్టిందని మహిళల్ని వేధించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.
కానీ పుట్టే బిడ్డ విషయంలో అసలు మహిళ పాత్ర అనేది ఏమి ఉండదని తెలుసుకోవాలి.. ఎందుకంటే పుట్టే బిడ్డ ఆడపిల్ల లేక మగ పిల్లాడా అనేది తండ్రి క్రోమోసోముల మీద ఆధారపడి ఉంటుంది. ఆడవాళ్ళలో రెండు X X క్రోమోసోములు మాత్రమే ఉంటాయి. అదే మగవారిలో XY అనే రెండు క్రోమోసోములు ఉంటాయి. అండాన్ని చేరే శుక్రకణం X అయితే అమ్మాయి పుడుతుంది. అదే అండాన్ని చేరే శుక్రకణం Y అయితే మగపిల్లవాడు పుడతాడు అన్న మాట. ఏవిధముగా బిడ్డ యొక్క లింగం అనేది తయారవుతుంది.ఈ పిండము నిదానంగా గర్భాశయం వైపునకు బయలు దేరుతుంది.
అండము వీర్యకణముతో కలయిక పొందిన తరువాత గర్భాశయానికి చేరడానికి మూడునుంచి నాలుగు రోజులు పడుతుంది. గర్భాశయంలోనే ఇది పెరిగి రకరకాలుగా మార్పులు చెందుతుంది. ఈ పిండము గర్బాశయానికి చేరేటప్పటికి గర్భాశయము క్రొత్త టిస్యూలతోను, క్రొత్తరక్తంతోనూ, సిద్ధంగా ఉండి పిండము ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కలిగించుకుని ఉంటుంది. గర్భాశయానికి చేరిన పిండము గర్భాశయపు గొడలకి గట్టిగా అంటుకుని ఉండిపోయి, అక్కడే శిశువుగా పెరిగి చివరికి నెలలు నిండిన తరువాత జననము జరుగుతుంది.