మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తమ శరీరంలో బ్లడ్ సుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే వైరస్ సోకిన తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని తెలుపుతున్నారు. అయితే, పండ్లు, కూరగాయల ద్వారా మధుమేహ రోగులు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన ఈ సర్వేల్లో ఏం చెప్పారో చూద్దామా.
టైప్-1, టైప్-2 డయబెటిక్లకు చాలా వ్యత్యాసం ఉందనే సంగతి తెలిసిందే. టైప్-1 పుట్టుక నుంచే ఉంటే.. టైప్-2 ఆహారపు అలవాట్లు, జీవనశైలి గతి తప్పడం వల్ల వస్తుంది. కొందరిలో పూర్వికుల నుంచి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. ఆయుష్సు సగానికి పడిపోయినట్లే. అయితే, ఆహారపు అలవాట్లను సక్రమంగా పాటిస్తూ.. శరీరానికి తగిన వ్యాయామం అందిస్తూ.. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా మాయం చేయొచ్చు.. రోజుకు 66 గ్రాములు పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకొనేవారిలో టైప్-2 డయబెటిస్ ఏర్పడే ముప్పు 25 శాతానికి తగ్గుతుందని తెలిపారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. రోజుకు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయాలను ఆహారంగా తీసుకోవాలి. కెన్యాలో జరిపిన పరిశోధనల్లో.. అక్కడి ప్రజల్లో 94 శాతం మంది రోజులో ఐదు కంటే తక్కువ స్థాయిలో పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకుంటారని తెలిసింది. ఫలితంగా వారిలో టైప్-2 మధుమేహం ఏర్పడే అవకాశాలు పెరిగినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.
అమెరికాలో జరిపిన పరిశోధనల ప్రకారం.. వివిధ ధాన్యాలను ఆహారంగా తీసుకొనేవారిలో టైప్-2 డయబెటీస్ వచ్చే అవకాశాలు 29 శాతం తక్కువని తేలింది. ముఖ్యంగా చిరు ధాన్యాలు, బ్రౌన్ రైస్, జొన్న, మొక్క జొన్న, గోదుమ పిండి చపాతీ లేదా రోట్లు తినేవారిలో డయబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువ. వీటిలో అధిక ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభవం కలుగుతుందని, దీనివల్ల ఎక్కువ చక్కెర శరీరానికి అందకుండా జాగ్రత్తపడవచ్చని స్టడీలో పేర్కొన్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినడాన్ని అలవాటు చేసుకుంటే.. మంచిదని చెబుతున్నారు. ఒకవేళ కరోనాకు గురైనా, ఆరోగ్యవంతుల్లా సులభంగా బయటపడవచ్చని తెలుపుతున్నారు. కాబట్టి.. పైవన్నీ పాటించి జాగ్రత్తగా ఉండండి.మీరు మధుమేహంతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు తీసుకోవాలి.