Diabetes: మధుమేహం బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది సెకనులకు ఇద్దరు కొత్తగా షుగర్ వ్యాధికి గురవుతున్నారు..!! డయాబెటిస్ ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికీ పాదాలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి..!! మధుమేహం ఉన్న వారిలో పాదాలకు వచ్చే సమస్యలు.. వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!
డయాబెటిస్ ఉందని తెలిసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మధుమేహాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యంగా నరాల బలహీనత ప్రధానంగా వస్తుంది. డయాబెటిస్ లెవెల్స్ పెరిగితే అరచేతిలో, అరికాళ్ళలో మంటలు , తిమ్మిర్లు వస్తాయి. పాదాల నుంచి మొదలుకొని కాళ్ళలోకి, ఆ పై భాగాలకు తిమ్మిర్లు వస్తాయి. ఇక అదే కొనసాగితే దీర్ఘకాలికంగా మూత్రపిండాలు పాడైపోయి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా గుండె, కంటిపై మధుమేహం ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. షుగర్ ఉన్న వారిలో గాయాలు, పుండ్లు ఏర్పడితే వాటిని ఆ శ్రద్ధ వహించకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అవి పెరిగి కాళ్లు, వేళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది.
డయాబెటిక్ ఉన్న వాళ్ళు కచ్చితంగా షుగర్ స్థాయి 180 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్ బి ఏ 1 సి పరీక్ష లో షుగర్ 7 కంటే తక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. నరాల లో ఉండే మైలిన్ షిత్ తగ్గటం వలన నరాల బలహీనత ఇంకా ఎక్కువ అవుతుంది. అందువలన విటమిన్ b12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలు, చేపలు, చికెన్ లివర్, రొయ్యలు, పుట్టగొడుగులు, పన్నీర్, సోయాబీన్స్, తృణధాన్యాలు మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ చెప్పులు వేసుకొని మాత్రమే నడవాలి గాయాలు, పుండ్లు ఉంటే తగిలిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలకు రక్త ప్రసరణ జరిగేలా ఆయిల్ తో మసాజ్ చేస్తూ ఉండాలి.