Diabetes: ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ సరిగా లేకపోవడం వలన ఎక్కువ మంది షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్నవారు.. తీపి ఆహార పదార్థాలు, కుక్కీస్, క్యాండీస్, సోడా, కృత్రిమంగా తయారు చేసే పదార్థాలు తినకూడదు.. ఇవి ఎక్కువ పోషకాలను కలిగి ఉండవు. వీటిలో నాణ్యత తక్కువతో పాటు కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి.. అందువలన ఇవి ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి.. దీనివలన షుగర్ ఎక్కువ అవుతుంది..
తీపి వస్తువులు తినాలి అని అనిపించే డయాబెటిస్ పేషంట్స్.. ఎక్కువ ఫైబర్ కలిగిన పండ్లు ఆపిల్ ,ద్రాక్ష, జామకాయ, నారింజ ,బెర్రీ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ కలిగిన పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతాయి.
డయాబెటిక్ పేషెంట్ ట్స్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఫుడ్స్ ను తీసుకోవాలి.. డైలీ ఆహారంలో భాగమేనా పాలలో ఒక శాతం కంటే తక్కువ ఉన్న ఫ్యాట్ పాలను, పాలపదార్థములను చూసుకుంటే శరీరంలోని కొవ్వు ఎక్కువ పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ పేషెంట్లు ఎండు ద్రాక్షాలను తీసుకోకుండా ఉంటే చాలా మంచిది.. ఎందుకంటే రక్తంలోని చక్కెర స్థాయిలను అవి పెంచుతాయి.. దాని బదులుగా తాజా ద్రాక్ష, స్ట్రాబెర్రీ, తాజా పీచు వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..
అదేవిధంగా వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ పాస్తా వంటివి ఎక్కువగా శుద్ధి చేయబడిన ఇంటి పదార్థాలను కలిగి ఉంటాయి.. ఈ రకమైన ఆహార పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను మార్పులు కలిగిస్తాయి.. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.. డయాబెటిక్ పేషెంట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయి.. వేయించిన ఆహార పదార్థలలో ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి.. అందువలన ఎక్కువగా ఆయిల్ లో వేయించిన వస్తువులను ఫ్రెంచ్ ఫ్రైస్ ను డోనట్స్ వంటి వాటిని తీసుకోవడం వలన అమాంతము బరువు పెరగడం జరుగుతుంది. దీనివలన షుగర్ పేషెంట్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి .. అందువలన డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఆహార పదార్థాలకు బదులుగా అధికంగా ఫైబర్ ఉండే.. చిరుధాన్యాలను తినటం వలన రక్తంలోని చెక్కే స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.