Diabetes: ప్రతి పది మందిలో ఏడుగురు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.. వయసుతో సంబంధం లేకుండా ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోంది.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని టిప్స్ ను ఖచ్చితంగా క్రమం తప్పకుండా పాటించాల్సిందే..! అవేంటంటే..!?
రోజు మనం ఆహారం తిన్న రెండు గంటల తర్వాత మాత్రమే నిద్ర పోయే లాగా చూసుకోవాలి. మనం తిన్న వెంటనే నిద్రపోతే తీసుకున్న ఈ క్రమంలో పిండి పదార్థాలు కాస్త షుగర్ గా మారతాయి. దీంతో గ్లూకోజ్ శక్తిగా మారదు. ఫలితంగా రక్తంలో చక్కెర లెవెల్స్ అమాంతం పెరిగిపోయి.. గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలు, నాడీవ్యవస్థ, నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రోజు వ్యాయామం చేయటం మరువకూడదు.
నేరేడు పండ్లు, గోధుమలు, పసుపు, బార్లి, తేనె, ఉసిరి, పెసర పప్పు, ఆవాలు వంటి ఆహార పదార్థాలను రోజు వారి డైట్ లో యాడ్ చేసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ రాకుండా చేస్తుంది. ఒకవేళ వస్తె నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్ల ఉసిరి రసం కలుపుకొని.. ఉదయం పరగడుపున తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కలబంద గుజ్జులో ఒక స్పూన్ బిర్యానీ ఆకు పొడి, ఒక చెంచా పసుపు కలిపి రోజుకు రెండుసార్లు తిన్నా కూడా షుగర్ నియంత్రణలో ఉంటుంది. కలబంద, ఉసిరి ప్రతి రోజు తీసుకోవడం వలన డయాబెటిస్ బారిన పడకుండా చేస్తుంది.