మలేరియా కేవలం దోమ కాటు కారణంగానేవ్యాపిస్తుంది.మన దేశం లో మలేరియా కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ,ఎజెన్సీ ప్రాంతాల్లో దీనిబారిన పడేవారు ఎక్కువగానే ఉన్నారు. చలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఛాతి లో నొప్పిగా ఉండటం, దగ్గు, చెమటలు పట్టడం, వాంతులు, విరేచనాలు, నీరసంగా ఉండటం, ఆయాసం లాంటివి రావడం, మలేరియా లక్షణాలుగా గుర్తించాలి.
దోమ కాటుకు గురైన వారం నుంచి 18 రోజలు వ్యవధిలో మలేరియా లక్షణాలు బయటపడతాయి. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వారు సూచించిన చికిత్స తీసుకుంటే… త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మలేరియా వచ్చిన తర్వాత చికిత్స కన్నా కూడా, రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూద్దాం . దోమతెరలను ఉపయోగించాలి.
ఆ దోమ తెరలను కూడా శుభ్రంగా ఉతికినవే వాడాలి. కిటీకీలు, తలుపులకు నెట్లు బిగించొచ్చు. మస్కిటో రిపెల్లెంట్స్ క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది. లేత ర౦గులో ఉ౦డి, శరీరాన్ని మొత్త౦ కప్పే బట్టలు వేసుకో౦డి. ఘాటైన వాసన లను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు ,కాబట్టి బంతి , రోస్మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తో పాటు , ద్రవహారం ఎక్కువగా తీసుకోవడం ముఖ్యం. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై,రోగాల బారిన పడకుండా ఉంటాం. ప్రపంచమంతటా వైద్యులు సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సీన్ కోసం కృషి చేస్తున్నారు. కానీ, ఇంతవరకూ, మనుషులకు ఉపయోగపడే మలేరియా వ్యాక్సీన్ తయారు కాలేదు.