ఈ కాలం లో అందరు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భోజనం కూడా ఏదో తిన్నా మన్న పేరుకి త్వర త్వరగా తిని లేస్తుంటారు.. అలా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. భోజనం చేసేటప్పుడు అన్నం బాగా నమిలి తినరు,గబా గబా మిగేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకుచాల సమయం పడుతుంది.
ప్రతి రోజు అలా జరగడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా బాగా నమిలి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవని చెబుతున్నారు అదే విధంగా, త్వర త్వరగా తినడం వల్ల అసిడిటీకి కూడా గురవలిసివస్తుంది. అందుకే ఆహారాన్ని నిదానంగా నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు. దీనివలన మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
అయినా ఎంత సంపాదించినా.. మన కడుపుకోసమేకదా.. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఇంకా ఏముంటుంది.. మరి ఆ ఆరోగ్యం కోసం ఆ మాత్రం నిదానంగా నమిలి తినలేమా.. ఆహారం యొక్క రుచి ఆస్వాదించలేమా…త్వరగా భోజనం చేసేటప్పుడు ఎంత ఆహారం తీసుకుంటున్నామనే విషయం తెలియదని, దీని వల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటామని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువ ఆహార ఫలితంగా బరువు పెరుగుతారని అంటున్నారు. అయితే నెమ్మదిగా తినాలన్నారు కదా అని మరి మెతుకులు లెక్కపెట్టుకుంటూ కూడా తినకూడదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అన్నం తినేటప్పుడు ఒక చక్కని పద్దతిని పాటించండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.