దీపావళి పండుగ సందడి మొదలైన సందర్భంగా మన ఇంటికి అతిథులను ఆహ్వానించి వారికి కానుకగా ఏవేవో బహుమతులు ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునే వారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దీపావళి జరుపుకోవడానికి కొన్ని నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీపావళి పండుగ అంటే ఇంటి అలంకరణ నుంచి మొదలుకుని పిండి వంటలు, పూజలు, టపాకాయలు కాల్చడం వంటి ప్రతి ఒక్కటి ఎంతో ఆడంబరంగా జరుపుకునే వారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు మీరు అభిమానించే వ్యక్తులను ఆహ్వానించే వారికి కానుకలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ ఈ దీపావళి కి ఇచ్చే కానుకలు ఆనందంతో పాటు ఆరోగ్యంతో కూడుకున్నవి కావాలనే మీ మిత్రులకు కానుకగా బాదంలను ఇవ్వడంతో ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా వెల్లివిరుస్తుంది.
ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భద్రత, ఆరోగ్యం పైనే దృష్టి సారిస్తున్నారు. చక్కటి ఆరోగ్యం బహుమతులుగా బాదములు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఇందులో ఎన్నో పోషక విలువలను కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇందులో జింక్,ఐరన్ ఫోలేట్, విటమిన్లు మొదలైనవి ఉండటంవల్ల రోగనిరోధక శక్తిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఈ సంవత్సరం జరుపుకునే దీపావళి పండుగ ఎంతో ఆరోగ్యవంతంగా ఆహ్లాదంగాకరంగా ఉండేలా క్రాకర్స్ ను కాల్చకుండా కేవలం దీపాలను అలంకరించి, రంగోలి వేసి ఎంతో ఆనందంగా,సాదరంగా ఆ లక్ష్మీదేవిని మన ఇంటికి స్వాగతించడంతో శుభం కలుగుతుంది. ఈ పండుగను కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ,ఈ సంవత్సరం దీపావళిని ఆనందంగా జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.