Salt: తినేటప్పుడు:
మనం దేవుడికి నివేదన చేయాలి అని అనుకున్నప్పుడు విస్తట్లో ఉప్పు మాత్రం వేయకూడదు అని పండితులు తెలియచేస్తున్నారు.
ఇక యోగశాస్త్రం తెలియచేసినదాని ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల వరకు ఉంటుంది. అది భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుందిమాట్లాడడం వలన శ్వాసగతి ఎక్కువయి ఆ యుష్షు తగ్గుతుంది. కనుక తినేటప్పుడు మాట్లాడకూడదు.
త్రయోదశినాడు వంకాయఆహారం గా తీసుకోకూడదు. అలాగే అష్టమి నాడు కొబ్బరి , పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని పురాణాలు తెలియచేస్తున్నాయి. దొండకాయ తింటే మాత్రం వెంటనే బుద్ధి నశిస్తుంది అని అంటారు.
Salt: రాత్రి ఆహారం తింటున్నప్పుడు,:
రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే (కరెంట్ పొతే )తింటున్న విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించి తర్వాత దీపాన్ని చూసి మిగిలినది తినాలే తప్ప మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలు చెప్పే మాట. రాత్రి ఆహారం తింటున్నప్పుడు, తుమ్మితే నెత్తిపై కాసిన్ని నీళ్ళు చల్లడం, దేవతను స్మరించుకోవడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వేసుకోకూడదు. ఒకవేళ తినవలిసి వస్తే మాత్రం నెయ్యి, పంచదార కలుపుకుని తినవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని తగ్గిస్తుంది. రాత్రిళ్లు చేసుకున్న మజ్జిగపులుసు ని ఉదయం వాడకూడదు. ఆవునేయి కంటికి చాలా మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికగా జీర్ణం అవుతాయి. ఆ మజ్జిగలో సైంధవలవణం కలిపి తాగితే వాతాన్ని , పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.
ఆహార నియమాలను పాటించే వారికి
నలుగురు తో కూర్చొని తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినడానికి ఇష్టపడరు. మునగ కాయలు మగతనానికి మంచిది అంటారు పెద్దలు.
ఎప్పుడూ ఒకే సమయం లోనే భోజనం తినడం వలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా పనిచేస్తుంది.
ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి..
ఆహార నియమాలను పాటించే వారికి ఔషధాల తో పని ఉండదు. ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు సరిగా పనిచేయవు. రోగికి ఔషధాల తో పని లేకుండానే నియమిత ఆహారం పాటించడం వలన కూడా వ్యాధులు తగ్గుతాయి.
అదే విధం గా రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే ఎంత అద్భుతమైన మందులు అయినా కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని గుర్తు పెట్టుకోవాలి .