God: మనం ఎంత బిజీ గా ఉన్న కూడా పూజ అనేది మానం.. పూజ చేసేటప్పుడు వాడే కొన్ని పదార్థాలతో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. కానీ అవి ఇప్పుడు కల్తీ జరిగి మన ముందుకు వస్తున్నాయి.. వాటి వలన ప్రశాంతత కాదు ఆరోగ్యాలు పాడవుతున్నాయి.
హానికర ప్రొడక్ట్స్ బదులు మనం ఎలాంటి పదార్ధాలు వాడాలి అనేది తెలుసుకుందాం..
అగర వత్తులు వెలిగించడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, ఒత్తిడిని తగ్గిస్తుంది. మనకు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా అగరవత్తులు హానికరమైన రసాయనాలతో, రక రకాల సువాసనలు వచ్చే పదార్థాలతో చేయబడుతున్నాయి. ఇలాంటివి వెలిగించేటప్పుడు వాతావరణ కాలుష్యం అవ్వడం తో పాటు అది ఏ ఉద్దేశంతో అయితే వెలిగిస్తామో అది మాత్రం జరుగదు. వీటికి బదులు సహజ పద్ధతిలో తయారు చేసినటువంటి వి వాడటం ఉత్తమం.నెయ్యి మనం చాలా సందర్భాల్లో వాడతాం. తెలియక మనలో చాలామంది గేదె నెయ్యి వాడతారు. గేదె నెయ్యికి, ఆవు నెయ్యికి మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. గేదె నెయ్యి రజోగుణం తో ఉంటుంది. ఆవు నెయ్యి సాత్విక గుణం తో ఉంటుంది. ఆవునెయ్యిలో గోల్డెన్ ఎనర్జీ ఉంటుంది . ఇది చాలా పవిత్రమైనది. గేదె నెయ్యి లో ఈ లక్షణం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా నెయ్యి వాడాలనుకున్నప్పుడు ఆవు నెయ్యి వాడటం మంచిది.
నూనెలు దీపం వెలిగించడానికి వాడుతుంటాం. దీపం వెలిగించగానే ఇంటి నిండా ఆధ్యాత్మికమైన వాతావరణం అలుముకుంటుంది. నూనెలు అవి తీయబడిన గింజలనుండి కొన్ని వైద్య పరమైన గుణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకి నువ్వుల నూనె కి నువ్వుల గింజల సుగుణాలు ఉంటాయి. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే చాలా రిఫైండ్ ఆయిల్స్ నిండా రసాయనాలతో నిండి ఉన్నాయి. అలాంటి నూనెతో దీపం పెడితే మన ఇంటి నిండా రసాయనాలు నిండిన ఉంటాయి. ఇది దీపం పెట్టడం వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని నెరవేర్చదు.. గానుగలో ఆడిన నూనె కొని తెచ్చుకుని దీపాన్ని వెలిగించడం మంచిది.