Food: కడుపులో ఎక్కువగా ఉండిపోయిన వాయువులు తేన్పుల రూపంలోబయటికి వస్తాయి. ఈ వాయువులు అలా జీర్ణాశయంలో నిల్వ ఉండిపోవటానికి కూడా కారణాలున్నాయి. మన పెద్దవారు చెప్తుంటారు తినేటప్పుడు మాటలాడవద్దని. అది చాలా నిజం ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. తినేటప్పుడు మాట్లాడటం వలన ఆహారం తీసుకుంటున్నప్పుడు గాలిని ఎక్కువగా మింగేస్తుంటాం.. దీనివలన తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, హియాటస్ హెర్మా,ఎసిడిటీ, వంటివాటితో పొట్టలో లో వాయువులు ఉత్పత్తి జరుగుతుంటుంది. ఈ సమస్య ఎక్కువైతే గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కాబట్టి ఆహారం తినేటప్పుడు నిదానంగా నమిలితినటం వలన పొట్టలో గాలి చేరకుండా ఉంటుంది. పాలు,క్యాబేజీ, చిక్కుడు జాతి కూరలు, ఉల్లిపాయతోపాటు వేపుళ్లను తగ్గించుకోవటం వలన వాయువులు తగ్గుతాయి. అల్లం, సోంపు,ఇంగువ, శొంఠి,వాము, పుదీనా, జీలకర్రను ఎక్కువగా వాడుతుంటే తేన్పులను సమర్ధ వంతం గా తగ్గించుకోవచ్చు . ఇంకా చెప్పాలంటే ఒకసారి తిన్న ఆహారం జీర్ణమయ్యేవరకు మళ్లీ తినకుండా ఉండటం మంచిది. ఆకలిగా ఉన్నపుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి.
తేన్పులు రాకుండా ఉండటానికి చిట్కాలు
భోజనం తిన్న వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకుని నెమ్మదిగా నములుతూ ఉంటే సమస్య తగ్గుతుంది.
వారం లో మూడు నాలుగు సార్లు పుదీనా పచ్చడిని ఆహారంలో తింటూంటే తేన్పులు రావటం తగ్గుతుంది.
వాము వేయించి పొడి చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే చెంచా వాముపొడి, అరచెంచా కరిగించిన నెయ్యి వేసుకుని తినటం మంచిది.
రెండు లేదా మూడు లేత తమలపాకుల్లో కొద్దిగా వక్క, సున్నం, ఒక లవంగం వేసుకుని .అన్నం తిన్న తరువాత ఈ తాంబూలం నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నములుతూంటే సమస్య నుండి విముక్తి లభిస్తుంది.