మీలో కనీసం ఒక్కరికైనా ఈ అనుమానం కచ్చితంగా వచ్చేవుంటుంది.ఆ అనుమానం ఏమిటంటే రైలు, ఏరోప్లేన్ లాంటివి నడుపుతున్నప్పుడు లోకో పైలట్ లేదా పైలెట్ కి నిద్ర వస్తే ఎమిజరుగుతుంది అని. ఎందుకంటే సాధారణం గా బస్, ఆటో లాంటి వాహనాల్లో డ్రైవర్లు మనకి కనిపిస్తుంటారు. కానీ ట్రైన్, ఇంకా ఫ్లైట్ లో కనిపించరు కదా?
రైలు లో అయితే బోగీ లు ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం కొంచెం దూరంగా ఉన్న బోగీలో ఉంటే అప్పుడు లోకో పైలట్ మనకి చాల దూరంగా ఉంటారు. ఇంకా మనకొచ్చే అనుమానం విషయానికి కొస్తే ఒకవేళ ట్రైను నడిపే లోకో పైలట్ కి నిజంగానే నిద్ర వస్తే ఏమౌతుంది? అనే ప్రశ్నకు కూడా జవాబు ఉంది. అదేంటంటే. లోకో లో ఒక విజిలెన్స్ డివైస్ ఏర్పాటు చేసి ఉంటుంది. లోకో పైలట్ లేదా అసిస్టెంట్ లోకో పైలట్ పుష్ బటన్ ని నిమిషానికి ఒకసారి ప్రెస్ చేస్తూ ఉండాలట.
విజిలెన్స్ డివైస్ ని ఎక్నాలెడ్జ్ చేయడానికి ఇలా నిమిషానికి ఒకసారి బటన్నొక్కుతూ ఉంటారట. ఒకవేళ లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైనా వేరే పని లో ఉంటే … అంటే స్విచ్ ఆపరేట్ చేయడం, హారన్ వేయడం, బ్రేక్ అప్లై చేయడం లో బిజీగా ఉంటే, అప్పుడు మాత్రం పుష్ బటన్నొక్కావలిసిన అవసరం ఉండదట. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ పనిచేస్తున్నప్పుడు విజిలెన్స్ డివైస్ దానంతట అదే ఎక్నాలెడ్జ్ అయిపోతుందట.
ఒకవేళ లోకో పైలట్ ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ ఏదో ఒక కారణం వలన ఎటువంటి పని చేయలేక పొతే, లేదా పుష్ బటన్ స్విచ్ కూడా నొక్కలేక పొతే, ఎనిమిది సెకండ్ల పాటు ఒక ల్యంప్ వెలుగుతుందట. కొన్నిసార్లు లోకో పైలట్ ఏదైనా ఆరోగ్య సమస్యల వలన అపస్మారక స్థితిలో ఉంటే, లాంప్ వెలిగినప్పుడు వచ్చే హెచ్చరికకి కూడా స్పందించలేకపోతుంటే, అప్పుడు ఎమర్జెన్సీ బ్రేక్ వాటంతటవే అప్లై అయ్యిపోయి , ట్రైన్ ఆగిపోతుందట .