మనకు పాతకాలం నుండి ఒక మాట నానుడి లో ఉంది..’నరుడి చూపు కి నల్లరాయి కూడా పగిలిపోతుంది’ అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాము. కొందరి చూపులకు అంతటి తీక్షణత ఉంటుంది. దిష్టి తీయడమ నేదిఎప్పటి నుండో ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది.
ఆ ప్రవాహం ఎదుటివారిపై వ్యతిరేకం గా పని చేసినప్పుడు వాళ్లకి వికారం గా ఉండడం ,తలనొప్పి, వాంతుల వడం వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇక ఉదయమే నిద్రలేవగానే బయటికి వస్తూ ఎదుటివారిని చుస్తే వారు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతు లను చూసుకోవాలని చెబుతారు. గుడిలో దేవుడికి పూజలు చేసేటప్పుడు మనకు కలిగే అనుభూతి వర్ణనాతీతం. అలాగే గుడి లో
దేవదేవుడికి సుప్రభాత సేవ తో మొదలు కుని ఎన్నో సేవలు జరుగుతుంటాయి.
అయితే.. దేవుడికి జరిగే అన్నీ సేవలూ మనం చూడడం తో పాటు ఆ సేవలలో పాల్గొంటూ ఉంటాము .. కానీ, అర్చన లలో జరిగే షోడశ ఉపచారా లలో ఒకటైన నివేదన జరుగుతున్నా సమయంలో మాత్రం పరదా వేసేస్తూ ఉంటారు. అందుకు కారణం కూడా దృష్టి దోషం కలగకుండా ఉండడానికే అని ఆగమ సంప్రదాయం చెబుతోంది. దేవునికి నివేదన చేసిన తర్వాత ఆ పదార్థం ప్రసాదం అవుతుంది. ఆ సమయంలో దేవుడి ని చూడకుండ పరదాలాగేస్తారు.ఇలా గుడిలో జరిగే జరిగే ప్రతి కార్యక్రమం వెనుక ఒక బలమైన కారణముంటుంది .