Ground Nuts: పిల్లలు నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే చిరు తిండిలో పల్లీలు కూడా ఒకటి..!! వేరుశెనగలు చక్కటి స్నాక్స్ యే కాదు పోషకాలతో కూడిన సంపూర్ణ ఆహారం..!! ఫ్రై, చట్నీ, స్నాక్స్, ఉప్మా, కారంపొడి వేటిలోనైన పల్లీలు లేకపోతే రుచి ఉండదు.. పల్లీలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని అందరికీ తెలిసిందే..!! లాభాల గురించి అందరికీ తెలిసిందే మరి నష్టాల గురించి తెలుసుకోవద్దా ..!? నష్టాలు కూడా ఉన్నాయా అనుకుంటున్నారా..!? వేరుశనగ గింజలు తినగానే మంచి నీళ్లు తాగకూడదట..!? ఒకవేళ తాగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో చూడండి..!!
సాధారణంగా పల్లీలు వేడి గుణాన్ని కలిగి ఉంటాయి. వేరుశెనగ గింజలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి అలాంటప్పుడు తిన్న వెంటనే నీటిని తాగితే అవి చల్లగా మారుతాయి దాని వలన లోపల వేడి పదార్థం చల్లటి పదార్థం ఒకదానితో ఒకటి కలిసి విరుద్ధమైన చర్యలు జరుపుతాయి. దాంతో దగ్గు, జలుబు తోపాటు శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. అలా అని నీళ్లు తాగకుండా ఉండకూడదు అని కాదు. వెంటనే కాకుండా కాస్త సమయం తీసుకొని మంచి నీళ్లు తాగండి.
వేరుశనగలు పోషకాలతో నిండి ఉంది. అయితే ఇవి పొడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువలన వీటిని తింటే ఎక్కువగా దప్పిక వేస్తుంది. అయితే తిన్న వెంటనే నీటిని తాగకూడదు. ఎందుకంటే పల్లీల లో నూనె ఉంటుంది. దీనిని తిన్న వెంటనే నీరు తాగడం వలన పేగులలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దాంతో పల్లీలు తినగానే త్వరగా జీర్ణం కావు. దీని వలన గ్యాస్, అసిడిటీ, అజీర్తి, వంటి సమస్యలు వస్తాయి. ఇంకా ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చు.