కరోనా వైరస్ ప్రభావంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో ప్రజలు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.నట్స్ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు శరీరానికి చాలా అవసరం.నిజానికి ఈ డ్రై ఫ్రూట్స్ ను అందరూ చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ కొన్ని ఆరోగ్య సమస్యలున్నవాళ్లు ఈ నట్స్ తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఈ డ్రైఫ్రూట్స్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
అజీర్ణ సమస్య ఉన్నవాళ్లు :
పీకన్ నట్స్ గురించి ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్ ఇదే..!!
అజీర్ణ సమస్య ఉన్నవాళ్లు నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి.ఎందుకంటే నట్స్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణం కావు. అందుకే అజీర్తి సమస్యలతో ఇబ్బంది పడేవారు నట్స్ కు దూరంగా ఉంటే మంచిది.
ఏసిడిటీ సమస్య ఉన్నవాళ్లు :
ఛాతీలో మంట, ఎసిడిటీ లేదంటే యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినకూడదు. నట్స్లో ఉండే ఫ్యాట్స్ ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. అందుకే ఛాతీలో మంట, పుల్లటి తేన్పుల సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా డ్రై ఫ్రూట్స్ తినకూడదు.
ఎలర్జీ సమస్య ఉన్నవాళ్ళు :
నట్స్ తింటే చర్మపై దద్దుర్లు, దురద వంటి ఎలర్జీ సమస్యలు వచ్చేవాళ్లు నట్స్ తినకూడదు.కొంతమందికి బాదం,వాల్నట్, జీడిపప్పు తింటే ఎలర్జీ వచ్చే అవకాశాలున్నాయి. నిజానికి నట్స్ ను నానపెట్టుకుని తిన్నప్పుడే అందులో ప్రోటీన్ సులువుగా జీర్ణం అవుతుంది.అలా కాకుండా ఎండువాటిని ఎండుగానే తినడం వల్ల పొట్ట హెవీగా ఉంటుంది. అప్పుడు డైజెషన్ నెమ్మదిగా అవుతుంది. ఎక్కువసేపు పొట్టలో నిల్వ ఉండి పులుస్తాయి. దానివల్ల గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి నానపెట్టుకుని