Roasted Food: మన ఆహార అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.. అందరి ఆహారపు అలవాట్లు ఒకే విధంగా ఉండవు.. కొంతమందికి వేడి వేడి ఆహారం తినటం ఇష్టమైతే.. మరి కొంతమందికి మాడిపోయిన లేదా అడుగు అంటిన ఆహారం తినడం ఇష్టం.. ఇంకొంతమంది నిప్పులపై కాల్చిన ఆహారాన్ని తినడానికి మక్కువ చూపిస్తారు.. అయితే ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..!! తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..!?
మాడిన ఆహారం, కాల్చిన ఆహారాన్ని తినటం ప్రమాదకరమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. నిప్పుల పై కాల్చిన ఆహారం, మాడిన ఆహారాలలో అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది. పిండి పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన కూడా ఈ రసాయనం ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ముఖ్యంగా అడుగంటిన అన్నం, మాడిపోయిన బ్రెడ్, ఉల్లిపాయలు, మొక్క జొన్న వంటి ఆహారాలు తీసుకోకూడదు. వీటిని తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ జనరల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక నుంచి అన్నం అడుగంటినా, మాడిన బిర్యానీ నీ తినకండి బ్రెడ్ స్లైసులు బాగా మాడిపోయిన తీసుకోకండి బాగా వేయించిన లేదా మాడిపోయిన ఉల్లిపాయలు, మొక్క జొన్న ను కూరలలో వేసి తినకండి. వండిన ఆహారం వృధా అవుతుందని తినేస్తే మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఈ పదార్థాలలో ఉండే అక్రిలమైడ్ రసాయనం క్యాన్సర్ మాత్రమే కాదు ఇతర ప్రాణాంతక వ్యాధులకు కూడా కావచ్చు. టోస్టింగ్, రోస్టింగ్, గ్రిల్లింగ్, డీ ఫ్రై వంటి ఆహారాలు ఆరోగ్యానికి హానికరమైనవి. ఇప్పటి నుంచి అడుగంటిన అన్నం, మాడిపోయిన బ్రెడ్, ఉల్లిపాయలు, మొక్క జొన్న తినకండి. అసలు మాడిపోయిన ఏ ఆహారం తినకుండా ఉంటే ఇంకా ఉత్తమం.