ఆరోగ్యానికి పెరుగు మంచిదా లేక మజ్జిగ మంచిదా అని చాలామందికి ఉన్న అనుమానం. కమ్మని గడ్డ పెరుగు తింటుంటే ఆ రుచి, కమ్మదనమే వేరు.
అయితే పెరుగు ఎక్కువగా తీసుకోవడం వలన వాత రోగాలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగుతో కొంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాసరే మజ్జిగే ఆరోగ్యానికి మంచిదని తెలుపుతున్నారు నిపుణులు. మజ్జిగ తాగేవాళ్ళకు ఏ జబ్బులు రావు. నీరసంగా ఉండటం, బరువు పెరగడం, చర్మ రోగాలు, క్షయలాంటి సమస్యల నుంచి ఇది కాపాడుతుంది.
మజ్జిగ తాగడం వలన గ్యాస్, ఉబ్బరం, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్దత, పేగుల్లో వచ్చే వ్యాధులు త్వరగా తగ్గుతాయి. డీహైడ్రేషన్ తో బాధపడే వారికి మజ్జిగ ఒక మంచి పరిష్కారం. మజ్జిగ త్రాగటం వలన జీర్ణాశయం, పేగులలో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణాశయ సమస్యలు రాకుండా కాపాడుతుంది. మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.
ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. బ్లోటింగ్ లేకుండా చేయడం తో పాటు అరుగుదలకి సహకరిస్తుంది. ఇమ్యూనిటీ ని పెంచుతుంది.
నోటి పుండు కి మంచి మందు విరేచనాల సమస్య ఉన్నప్పుడు మజ్జిగలో కాస్త తేనె లేదా వేయించిన జీలకర్రను కలిపి తీసుకోవడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న మజ్జిగని వర్షాకాలమని, చలికాలమని నిర్లక్ష్యం చేయడం వలన అనారోగ్యాలు రాక మానవు. కాబట్టి ఎలాంటి వాతావరణం అయినాకూడా మజ్జిగ తీసుకోవడం మానవద్దు .