అందరికి అందుబాటులో ఉండే అరటిలోని గొప్ప గుణాల పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలుఎన్నో కొత్త అంశాలను తెలిపారు . రోజుకి మూడు అరటిపండ్లు తింటే గుండె సమస్యలు చాలా వరకూ తగ్గుతాయని చెబుతున్నారు. అరటిపండ్లు ప్రతి రోజు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
అరటిపళ్ళు మనకు రోజంతా శక్తిని ఇస్తాయనిచెబుతున్నారు నిపుణులు. అందుకే వ్యాయామం చేసే వారు ఈ పండ్ల ని తినడం మంచిదని సూచిస్తున్నారు. అరటిపండులో పొటాషియం సమృద్ధి గా ఉంటుంది. అంతేకాకుండా, సోడియం నిక్షేపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఐరన్, హిమోగ్లోబిన్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల రక్తహీనత సమస్యలు దరిచేరవు. ఈ కాలం లో చాలా వరకూ అన్నీ ఆహారపదార్థాలను ఫ్రిజ్లో పెట్టేస్తున్నారు. అలా పెడితే అవి చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని అంటారు.
అయితే, అరటిపండ్ల ను మాత్రం అలా పెట్టకూడదు అని చెబుతున్నారు. అరటి పండ్లని ఫ్రిజ్లో పెట్టడం వలన అవి సరిగా పండక పోగా వాటి తొక్కు రంగు మాత్రం మారిపోతుంది. దీనిపై ఆహార నిపుణులని వివరణ కోరగా..అరటి పండ్లని ఫ్రిజ్లో పెట్టకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లు మగ్గ డానికి పొడి వాతావరణం చాల అవసరం. పొడి వాతావరణం లో అరటి పళ్ళు పండితే రంగు తో పాటు రుచి కూడా బాగుంటుంది.
అందుకని వాటిని ఫ్రిజ్లో అస్సలు పెట్టకూడదు.అరటి పండ్లు ఫ్రిజ్లో పెట్టడం వల్ల సరిగా పండక పోగా పై తొక్కు నల్లగా మారిపోయి పండు రుచి తగ్గిపోతుంది.అందుకే ఫ్రిజ్లో పెట్టకూడదని చెబుతున్నారు. రంగు, రుచి మారతాయి తప్ప ఫ్రిజ్లో పెట్టిన పండ్లు తమ గుణాన్ని ఏమాత్రం కోల్పోవు. అంతే ఆరోగ్య ప్రయోజనాలని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.