Eating: మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. ఆహారం తిన్న తర్వాత మనం చేసే పనుల వల్ల కూడా మన ఆరోగ్యం ముడిపడి ఉంటుందని కొందరికే తెలుసు.. అసలు భోజనం చేసిన తరువాత ఎలాంటి పనులు చేయాలి..!? ఎలాంటి పనులు చేయకూడదో..!? ఇప్పుడు తెలుసుకొని పాటిద్దాం..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సాధారణంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసిన తర్వాత కనీసం పది నిమిషాలపాటు నడవాలి. మరీ ముఖ్యంగా ఎనిమిది ఆకారంలో నడిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇలా ఇలా ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత పది నిమిషాలు, మధ్యాహ్నం భోజనం తర్వాత పది నిమిషాలు, రాత్రి డిన్నర్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడిస్తే అసలు వాకింగ్ కూడా చేయనవసరం లేదు. మీరు హెల్తీ గా ఉంటారు. రాత్రి భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత మాత్రమే నిద్రపోవాలి. ఈ లోపు నిద్రపోతే తిన్న సరిగ్గా జీర్ణం కాక మధ్యలో మెలుకవ రావడం, కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పండ్లు తినకూడదు. పండ్లను తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. పొట్టలో అసౌకర్యానికి దారితీస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే ధూమపానం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత పొగతాగే అలవాటు ఉంటే మీరు బరువు కూడా పెరుగుతారు. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు కనీసం గంట తరువాత చేయడం మంచిది. భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే శరీరం ఉష్ణోగ్రత పెరిగి తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. స్నానం చేశాక భోజనం చేయడం ఉత్తమం.