మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తూ ఉండాలి. అలాగే మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో ముఖ్యమైన అవయవంగా కిడ్నీలను చెప్పుకోవచ్చు. కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోతే మనిషి మనుగడ కష్టం అవుతుంది.అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మానవుని శరీరంలో కిడ్నీ ఒక ఫిల్టర్ లాంటిది.శరీరం నుంచి విష పదార్ధాల్ని మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తూ ఉంటాయి.ఈ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో విషపదార్ధాలు పేరుకుని పోతాయి. అందుకే కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతి రోజూ లెమన్ డ్రింక్ తీసుకోవడం ద్వారా కిడ్నీలను శుభ్రపర్చుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మరి ఆ డ్రింక్ ఏంటి.? ఎలా తయారుచేయాలి? ఎప్పుడు ఎలా తాగాలో అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ 2 నిమ్మకాయల రసం తాగడం తాగితే కిడ్నీ నుంచి విషపదార్ధాలు బయటకు తొలగిపోతాయి. అలాగే కిడ్నీలలో రాళ్ల సమస్య ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ మంచి ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ ఉదయం, మద్యాహ్నం తప్పకుండా ఈ డ్రింక్ తాగాలి.
పుదీనా లెమన్ డ్రింక్:
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పుదీనా లెమన్ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం,కొద్దిగా పుదీనా ఆకులువేసి బాగా కలిపి ఒక రెండు గంటల పాటు అలానే ఉంచాలి. తరువాత ఆ వాటర్ లో తేనె కలుపుకుని రోజూ ఉదయం లేదా మద్యాహ్నం పూట తీసుకుంటే ఆరోగ్యానికి, కిడ్నీలకు చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో కిడ్నీలకు కూడా అంతే మంచిది.ఒక గ్లాసులో సగానికి నీళ్లు తీసుకుని మరొక సగం కొబ్బరినీళ్లు పోసి అందులో కొద్దిగా నిమ్మరసం పిండి కలుపుకుని తాగాలి.