స్త్రీల శారీరక ఆరోగ్యం లో కీలక పాత్ర పోషించేది పునరుత్పత్తి వ్యవస్థ. ఈ పునరుత్పత్తి ప్రక్రియకు సిద్ధం చేయడంలో ప్రధానమైనది రుతుచక్రం.దీనినే నెలసరి అని అంటుంటారు. స్త్రీ యుక్త వయస్కురాలైనప్పటి నుంచీ నడిమి వయస్సు వరకూ నెల నెలా స్త్రీ ల జీవితం లో అతి సాధారణం గా జరిగిపోయే అతి సంక్లిష్టమైన జీవ ప్రక్రియ ఇది. ఆరోగ్యవంతురాలైన ఆడవారి లో నెలసరి 28 రోజులకోసారి వస్తుంది.
అయితే ఈ రుతుచక్రం అనేది అందరి లో ఒకే విధంగా ఉండదు.కొందరి ఆడవారిలో 24 రోజులకోసారి వస్తే మరి కొందరికి 30 రోజులకోసారి రావచ్చు. 21- 35 రోజుల మధ్య ఎప్పుడొచ్చినా అది సాధారణం అనేచెప్పాలి. నెలలో ఎప్పుడు పడితే అప్పుడు వస్తూంటే మాత్రం గైనకాలజిస్టును సంప్రదించాలి. రుతుస్రావం ఒకరిలో 3 రోజుల పాటు వుంటే మరొకరి లో 5 రోజుల పాటు వుండవచ్చు. ఇది శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
కొంతమంది రుతుక్రమం సమయంలో అధిక రుతుస్రావంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక రక్తస్రావంతో స్త్రీలు లు తీవ్ర నీరసానికి గురిఅవుతారు . ఆరోగ్యం కూడా పాడవుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు సమస్య తీవ్రమైయే అవకాశముంది.కొన్ని కొన్ని ఇంటిచిట్కాలతో ఈ సమస్య కు పరిష్కారం దొరుకుతుంది. అవేంటో తెలుసుకుందాం . ఋతుస్రావసమయం లో రాత్రిపూట మొంతులు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల సమస్య తగ్గే అవకాశం ఉంది . వీలునప్పుడల్లా బెల్లం ని తింటూ ఉండాలి .టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్ బియ్యం కడిగిన నీటి లో కలిపి తాగితే అధిక రుతుస్రావం తగ్గించుకోవచ్చు .
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.