మనిషి జీవిత కాలం పెరగడానికి చాలా కారణాలుఉంటాయి. శాకాహారం కూడా ఆకారణాల లో ఒకటి అనే చెప్పాలి. పండ్లూ, కూరగాయలూ ఎక్కువ తింటున్నప్పుడు శరీరం లో కెమికల్స్, టాక్సిన్స్, తక్కువ ఏర్పడుతాయి. దీనివలన జీవిత కాలం పెరగడం తో పాటు ఆరోగ్యంగా జీవించగలుగుతారు.
ఆరోగ్యం గా సంతోషం గా ఉండాలంటే శాకాహారం మంచిదని చెబుతుంటారు. శాకాహారాన్నిసంపూర్ణ పోషక ఆహారం గా చెప్పవచ్చు. ఇందులో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్, పీచు, విటమిన్స్ సీ, ఈ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, ఇంకా ఫైటో కెమికల్స్ ఉన్నాయి. ఈ కారణం వలనే శాకాహారం మాత్రమే తీసుకునే వారికి బీపీ, కొలెస్ట్రాల్ అదుపు లో ఉంటాయి. వీరికిగుండే సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం బాగా తక్కువ. శాకాహారాన్నీ జీర్ణించుకోవడం కూడా చాల తేలిక, వండుకోవడం తేలిక, ఖర్చు కూడా తక్కువ పైగా మంచి ఆరోగ్యం.
శాజపాన్లోని ఒకినావ దీవుల్లో జీవించే ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అక్కడి జనాభాల్లో ప్రతి లక్ష మందిలో 70మంది నూరెళ్లు పూర్తి చేసుకున్నవారు ఉంటారు. ఇది ఎలా సాధ్యమని ఎంతో మంది శాస్త్రవేత్త లు అనేక పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో నే ఓ విషయం తెలిసింది. అక్కడి ప్రజలు చాలా వరకూ ప్రోటీన్ ఉండే ఆహారం కన్నా పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్నిఎక్కువగా తీసుకుంటారు . ఆహారం లో ఖచ్చితంగాచిలగడదుంప ఉండేలా చూసుకుంటారు.
ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల గుండెజబ్బులు,క్యాన్సర్, అల్జీమర్స్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు లేక పోవడం వలన ఒత్తిడి తగ్గి ఆయుష్షు పెరుగుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు . ఒకినావా ప్రజలు చక్కని ఆహారనియమాలు పాటిస్తూ పచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తింటూ మాంసాన్ని మాంసాహారాన్ని తక్కువగా తీసుకుంటారట . వీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఎక్కువగా ఉండి కెలోరీలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా.. వీరుచేసే శారీరక శ్రమ కూడా వారి ఆరోగ్యానికి ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు . ఎక్కువ శాకాహారం తింటూ తక్కువ మాంసాహారం తీసుకుంటూ శారీరక శ్రమ చేస్తూ ఉంటే మనిషి నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉంటారు అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అంటున్నారు నిపుణులు .