కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే అనారోగ్య సమస్యల బారినపడరు.. గుడ్డు పోషకాహారమే కాదు శాఖాహారం కూడా.. అలా అని ప్రతి రోజు ఒకే విధంగా చేసుకొని తినాలంటే కూడా బోర్ కొడుతుంది.. అందుకే ఈరోజు జీడిపప్పు ఎగ్ మసాలా కర్రీ రెసిపి గురించి తెలుసుకుందాం..! ఈ కర్రీ చాలా టేస్టీగా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు..!
జీడిపప్పు ఎగ్ మసాలా కర్రీ..
కావలసిన పదార్థాలు..
ఉడికించిన గుడ్లు ఆరు, జీడిపప్పు 50 గ్రాములు, ఉల్లిపాయ ఒకటి, టమాట రెండు, ఎండు మిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా,ఉప్పు తగినంత, పంచదార అర చెంచా, పసుపు చిటికెడు, కారం ఒక చెంచా, నూనె పావు కప్పు, వెన్న ఒక చెంచా, ఫ్రెష్ క్రీమ్ రెండు చెంచాలు, పెరుగు రెండు చెంచాలు, గరం మసాలా అర స్పూన్, జీలకర్ర పొడి ఒక చెంచా.
ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు నిమిషాలు నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, ఉప్పు, పంచదార, జీడిపప్పు, కసూరి మేతి వేసి బాగా వేయించుకోవాలి. ఇపుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని నూనె వేసి తాలింపు వేసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పుల పేస్టును వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇందులో ఉడికించిన గుడ్లు వేసి ఒకసారి కలపాలి. ఇందులో పెరుగు, పసుపు, ఉప్పు, కారం , ధనియాల పొడి, కస్తూరి మేతి అన్నింటినీ వేసి బాగా కలపాలి .ఇందులో అరకప్పు నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత నెయ్యి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద కూర ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంతవరకు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే జీడిపప్పు ఎగ్ మసాలా కర్రీ రెడీ.. అన్నం చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది..