తల్లినవమాసాలు మోసి తన రక్తమాంసాలను పంచి బిడ్డకు జన్మనిస్తుంది. తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో పెరిగే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే లభిస్తుంది.శిశువుజన్మించగానే తల్లికి వెంటనే పాలు రావడం మొదలవుతుంది . తల్లిపాలు తాగిన పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.తల్లి పాలు పిల్లలకు సంపూర్ణ పౌష్టిక ఆహారం అని చెప్తూఉంటారు.
బిడ్డకు పాలు ఇవ్వడం తల్లికి బిడ్డకు ఇద్దరికీ ఆరోగ్యవంతమైనది. వారి ఇద్దరి మధ్య చక్కని అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. చాలామంది తల్లులు తమనుండి వచ్చే పాలను ఇవ్వడానికి కి ఎక్కువగా ఇష్టపడరు . దానికి వ్యక్తిగత కారణాలు చాలా ఉంటాయి. నిజానికి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని డాక్టర్లు చెప్పే మాట. బిడ్డ పుట్టిన దగ్గరనుండి ఆరు నెలల వచ్చేవరకు బిడ్డకు అవసరమైనన్ని న్యూట్రియెంట్స్ తల్లి పాల ద్వారా మాత్రమే అందుతాయట .
పిల్లలు వైరస్, బ్యాక్టీరియా ను తట్టుకోగలిగే అంత రోగనిరోధకశక్తి తల్లి పాలల్లో లో ఉంటుంది .
చిన్న వయ్యస్సు లోనే చాలామంది పిల్లలలో ఒబెసిటీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లి పాలు ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యకరమైన బరువు ఉంటారట.
పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ శాతం పెరగాలన్న కూడా తల్లి పాలు చాల అవసరం.
గర్భం దాల్చడం తో పెరిగిన బరువు బిడ్డకు పాలు ఇవ్వడం తో తగ్గుతారట . పిల్లలకు పాలు ఇవ్వడం వలన కాన్పు తర్వాత వచ్చే డిప్రెషన్ కి గురి అయ్యే అవకాశం తగ్గుతుంది.
తల్లుల్లో టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, ఆర్థరైటిస్, గుండెకి సంబంధించిన సమస్యలు, వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట.
తల్లి పాలు తాగిన పిల్లలకు ఎలర్జీలు, చైల్డ్ లుకేమియా, ఇన్ఫెక్షన్స్, జలుబు, శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయట.కాబట్టి పిల్లలకు తల్లి పాలంత సురక్షితమైనది మరొకటి లేదనే చెప్పాలి .