Arjuna: ఈ ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు చాలా మందికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి.. వాటిని తగ్గించుకోవడం కోసం హాస్పటల్ చుట్టూ సంవత్సరం పొడుగుతా తిరుగుతూనే ఉంటాము. మధ్యతరగతి కుటుంబం వారైతే వారి సంపాదనలో సగం హాస్పిటల్ కి ఖర్చు అవుతుంది. ఇలా ఎక్కువ ఖర్చులు అవకుండా ప్రకృతిలో దొరికే ఒక చెట్టు బెరడు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..
“అర్జున చెట్టు “అనే ఈ బెరడు ఇంగ్లీష్ మందులలో ఆయుర్వేదంలో, అల్లోపతి, నాచురోపతి లో కూడా ఉపయోగిస్తారు. ఈ అర్జున చెట్టు బెరడు కషాయము సేవించడం వలన శరీరం లోని కొన్ని భయంకరమైన రోగాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా రెండు మూడు అంగుళాలు ఉన్న అర్జున చెట్టు బెరడును చిన్న ముక్కలుగా చేసుకొని.. దీనిలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టలి.. పావు చెంచా దాల్చిన చెక్క పొడి వేసుకొని బాగా మరిగించాలి.. అలా రెండు గ్లాసులు ఉన్నా ఈ పానీయం సగం అయ్యేవరకు మరిగించి.. ఆ నీటిని వడగట్టుకుని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ పానీయాన్ని ఉదయాన్నే పరగడుపున తాగాలి..
ఇలా తాగటం వలన గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్, జలుబు , దగ్గు , జ్వరము , నరాల బలహీనత, ఎముకల బలహీనత, అలసట, కళ్ళు తిరగటం వంటి సమస్యలు తగ్గుతాయి.. ఈ కషాయాన్ని చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు.. దీని వలన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. పూర్వం ఋషులు ఈ కషాయాన్ని ఎక్కువ సేవించేవారు.. ఎటువంటి ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా శరీరంలోని రుగ్మతులను తొలగించుకోవడానికి పాతకాలం రోజులలో ఈ కషాయాన్ని తీసుకునే వారట.