ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఆహారం తీసుకోవాలి. ఇందులో శరీర పెరుగుదలకు అవసరమైన పోషకాలు, విటమిన్లు ఉండాలి. అయితే, కొందరిలో ఆహారం తీసుకున్నప్పటికీ.. ఎక్కువ సమయం గడవక ముందే మళ్లీ తినాలనిపిస్తుంది. దీంతో నిత్యం ఏదోఒకటి తినేస్తూనే ఉంటారు. అయినప్పటికీ.. ఆకలి తీరకపోగా..తినాలనిపిస్తూనే ఉంటుంది. దీని కారణంగా బరువు పెరడగంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే, మానసిక రోగాలు సైతం పలకరిస్తాయి.
అయితే, అతిగా ఆకలి వేయడం.. దీంతో తినడం వల్ల కలిగే అనేక రకమైన రోగాలు నుంచి బయటపడటాకిని అనేక రకమైన వ్యాయామాలు, చికిత్సలు అవసరమవుతాయి. అయితే, అతి ఆకలి అనే ఆహార సమస్యను దానితోనే జయించవచ్చునని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఒక రకమైన ఆహారం తీసుకోవడంతో అతి ఆకలిని కట్టడి చేయవచ్చునని యూనివర్శిటీ ఆఫ్ జార్జియా పరిశోధకులు వెల్లడించారు. వారి పరిశోధనకు సంబంధించిన అధ్యయన వివరాలను తాజాగా వెల్లడించారు.
యూనివర్సీటీ ఆఫ్ జార్జియా పరిశోధకులు అధ్యయనం ప్రకారం.. వాల్నట్స్, సాల్మన్ ఫిష్లు, కనోలా విత్తనాల నుంచి తీసిన నూనెలు, కొవ్వుల (పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్- PUFA)తో అతి ఆకలి సమస్యను అధిగమించవచ్చు. దీన్ని వాల్నట్స్, సాల్మన్, కనోలా ఆయిల్లోని బహుళ అసంతృప్త కొవ్వులు వీటి వల్ల శరీరంలోని హార్మోన్లు సంతృప్తి చెంది మళ్లీ మళ్లీ తినాలనిపించే కోర్కెలు రాకుండా తగ్గిస్తాయి. దీంతో అతి ఆకలి సమస్య దూరమవుతుంది అని ఈ అధ్యయనం వెల్లడించింది.
ఒక్క ఆకలి సమస్యనే కాకుండా ఇతర ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మేరకు వారు 18 నుంచి 35 ఎళ్ల వయస్సు మధ్య గల వారిని తమ పరిశోధనకు ఉపయోగించుకున్నారు. ఇందులో మొత్తం 26 మంది పాలుపంచుకోగా, వారిలో పురుషులు, మహిళలు కూడా ఉన్నారు. వీరికి వారం పాటు పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్ ఆహారాన్ని ఆందించి, వారిలో కలిగిన మార్పులను గురించి తెలుసుకున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా దీనిని తీసుకోవడం ద్వారా అతి ఆకలి సమస్య తగ్గినట్టు గుర్తించినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది.