HEALTHY EYE’S: ప్రస్తుత రోజుల్లో మానవజీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. నిద్ర లేచింది మొదలు పడుకునే అంతవరకు మనిషి… ఇతరులతో కంటే ఎక్కువగా సెల్ ఫోన్ తోనే గడుపుతున్నాడు. మరోపక్క యువత ఎక్కువగా టెక్నికల్ జాబులు చేస్తూ జీవితం రాణిస్తున్నారు. సో దీన్నిబట్టి ఎక్కువగా చూసుకుంటే మనిషి కళ్ళు… డామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్లు మరియు స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో… కళ్లపై ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది. దీంతో చిన్ననాటినుండే మనిషి కళ్ళకి కళ్ళజోడు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముఖ్యంగా కరోనా రాకతో చాలా వరకు మనిషి ఇంట్లోనే ఉంటూ.. వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాలు చేస్తూ.. కంప్యూటర్, ల్యాప్టాప్ లపై పనిచేస్తూ ఉండటంతో.. కంటి చూపు ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో కంటిచూపు సమస్యా అధిగమించడానికి…తీసుకోవలసిన ఆహారాల వివరాలు తెలుసుకుందాం. రోజుకి ఒక్క గుడ్డు తినడం వల్ల.. కంటిచూపు సమస్యను అధిగమించవచ్చు అని వైద్యులు చెప్పుకొస్తున్నారు. గుడ్డులో ఉండే జింక్ కి కంటి చూపును మెరుగు పరిచే సుగుణాలు ఉన్నాయి.
మొక్కజొన్న, క్యారెట్, పాలకూర, నానబెట్టిన బాదం… ఇంకా చేపలు తినటం వల్ల కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో అదేపనిగా ల్యాప్టాప్.. లేదా కంప్యూటర్ ఇంకా సెల్ ఫోన్ చీకటిలో చూడకుండా… వర్క్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా చీకటిలో దగ్గరగా సెల్ ఫోన్ పట్టుకుని చూడటం వల్ల దానికి సంబంధించిన కిరణాలు పడి భారీగా డ్యామేజ్ చేయడం జరుగుతుందని… ఎంతైనా వెలుతురులో సిస్టం వర్క్ లేదా సెల్ ఫోన్ వాడటం మంచిదని చెప్పుకొస్తున్నారు.