Rice: బియ్యంతో చేసిన అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. బియ్యంలో న్యూట్రియన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యాన్ని వేయించి ఉడికించి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం…
వేడి వేడి గా ఉన్న అన్నాన్ని తినడం వలన బలం తగ్గిపోతుంది. అలాగే బాగా చల్లబడి మెతుకులు గట్టిగా ఉన్న అన్నం అజీర్ణానికి కారణమవుతుంది.వండిన అన్నం కొంచెం వేడి చల్లారిన తర్వాత తినడం అనేది ఆరోగ్యానికి మంచిది .సహజంగా నీటితో అన్నం వండుకుంటారు.అయితే మజ్జిగలో వండిన అన్నం తింటే మూల వ్యాధి తగ్గుతుంది. వాత వ్యాధులను,నీరసాన్ని తగ్గిస్తుంది. శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది.పైత్యం, జలుబు తగ్గేలా చేస్తుంది .బియ్యాన్ని నాలుగు రెట్ల నీళ్ళలో బాగా ఉడికించిన అన్నం తినటం వలన హృదయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. బలాన్ని చేకూరుస్తుంది. కంటి దోషాలు , ఒంటి నొప్పులు తగ్గిస్తుంది.బియ్యాన్ని వేయించి వండుకున్న అన్నం పైత్యం,కఫం, వాతం, వ్యాధులను అడ్డుకుంటుంది. క్షయ,జ్వరాలు, అతిసార వ్యాధి నుండి రక్షణ కల్పిస్తుంది.
వేయించిన పెసరపప్పు ఒక కప్పు , వేయించిన బియ్యం రెండు కప్పులు, తీసుకుని వాటిని పద్నాలుగు రెట్ల నీటిలో ఉడికించుకోవాలి. మరొక పాత్రలో నూనె వేసి.. ధనియాలు, శొంఠి, పిప్పళ్లు, ఇంగువ, ఉప్పు,మిరియాలు కొద్ది కొద్దిగా వేసి దాన్ని అన్నానికి తిరగమూత పెట్టి.. ఆ ఆహారాన్ని తింటే త్రి దోషాలను తగ్గిస్తుంది. రక్త వృద్ధిని పెంచడంతో పాటు, ఆకలిని పెంచుతుంది. దీనితో ప్రాణశక్తి కూడా వృద్ధి చెందుతుంది. పద్నాలుగు రెట్ల నీళ్ళలో బియ్యాన్ని బాగా ఉడికించి గంజి లా చేసి తీసుకుంటే అతిసార వ్యాధి,జ్వరాలను, తగ్గిస్తుంది. వాత వ్యాధులు తగ్గడం తో పాటు జీర్ణశక్తి వృద్ధి అవుతుంది.