సరైన విధానం లో కూరగాయలను తరగకపోతే వాటిలోని పోషకాలు మనకు సరిగా అందవు. అందుకే ముందు గా కూరగాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇది మొట్టమొదటి రూల్. తరగక ముందే కడగడం వలన వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ను నిలిపి ఉంచేందుకు సహకరిస్తుంది. ఎందుకంటే తరిగిన తరువాత కూరగాయలను కడిగితే వాటిలో పోషకవిలువలు ఏమాత్రం ఉండవు.
ఆరోగ్యాయానికి ఎంతగానో సహకరించే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ను కోల్పోతాము.పదును గా ఉన్న కత్తి బదులు మొద్దుబారిన కత్తిని వాడితే కూరగాయలలో పోషకాలను కోల్పోతాము. కూరగాయల చెక్కు తీసే విధానం కూడా కూరగాయల యొక్క పోషకాలపై ప్రభావం ఉంటుందట . పీలర్ ను ఉపయోగించి చేత్తో పీల్ చేసేటప్పుడు వాటిపై హానికర బాక్టీరియా తక్కువగా ఉంటుందట. బాగా సన్నగా తరిగిన కూరగాయలు త్వరగా పాడైపోతాయి.
మాములుగా తరిగి పెట్టుకున్న కూరగాయల కన్నా బాగా సన్నగా తరిగినవాటికే ఈ ప్రమాదం ఎక్కువట. ఈ పద్దతి వల్ల కూరగాయలలో తేమ శాతం తగ్గిపోతుంది. సహజం గా ఉండే వాటి రంగును కోల్పోతాయి. దాంతో వాటిలోనున్న పోషకాలు కూడా తగ్గిపోతాయి. కూరగాయల ను ముందుగా కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .అన్ని కూరగాయలు తరిగే పద్దతి ఒకే విధం గా ఉండదు. తరిగే విధానం అలాగే చెక్కు తీసే విధానం కూరగాయలను బట్టి మారుతూ ఉంటుంది .
టమాటో, బంగాళా దుంప అలాగే దోసకాయ,వంకాయలు చెక్కు తీయకుండా వాడుకోవాలి . వాటిని చెక్కుతో సహా తినేయవచ్చు. ఎడిబుల్ స్కిన్ కలిగిన పండ్లు అలాగే కూరగాయలను చెక్కు తియ్యకుండా తినేయడం మంచిది. ఆలా చేయడం వలన వాటిలోని పోషకాలు నష్టపోవడం జరగదు. ఉదాహరణకు, ఆలూ, కేరట్ అలాగే దోసకాయల వంటివాటిని నీళ్లతో శుభ్రంగా కడిగేసి వాడుకోవాలి. పళ్ళు ,కూరగాయల నుంచి పోషకాలు కోల్పోకుండా ఉండాలంటే వాటి చెక్కు తియ్యకుండా అలాగే భద్రపరచు కోవాలి . వాడుకునే టప్పుడు మాత్రమే వాటి చెక్కు తీసుకోవాలి. ఒకవేళ సమయం లేక ముందుగానే తరిగి పెట్టుకోవాలిసి ఉంటె వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లలో పెట్టి ఫ్రిడ్జ్ లోఉంచుకోవాలి .