ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆరోగ్యానికి మించిన సంపాద లేదని కూడా చెప్తారు. మనం ఆరోగ్యం తో ఉన్నప్పుడే ఏదైనా సాధించడంతో పాటు ఎన్ని విజయాలైన సొంతం చేసుకోగలం. ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా శరీరం సహకరించదు. శరీరం ఆరోగ్యం గా ఉన్నపుడే మనం ఏమి చేసిన.. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించి తీరవలిసిందే. అవి ఎలాంటి నియమాలో చూద్దాం.
ఈ రోజుల్లో అందరికి అందుబాటులో రోడ్డు పక్కన జంక్ ఫుడ్, ఫ్రైడ్ రైస్ వంటివి దొరుకుతున్నాయి… ముందు వాటిని తినడం మానుకోవాలి. లేదా తగ్గించాలి. వీటిని ఎక్కువగా తినడం వలన శరీరం లో అధికంగా కొవ్వు చేరుతుంది.. కాబట్టి మంచి సమతుల్యమైన ఆహరం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం అలవాటుగా మార్చుకోవాలి.
డిజిటల్ యుగంలో మొబైల్, ల్యాప్ ట్యాప్ ,లేదా టీవీ వంటివి లేకుండా మనిషి ఒక్క క్షణం కూడా గడపలేక పోతున్నాడు. వేలైనంతగావీటి వాడకాన్ని తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ఎంత తీరిక లేనప్పటి కీ రోజులోమీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక అరగంట సమయాన్ని నడిచేందు కు తప్పనిసరిగా వినియోగించుకుంటామని దృఢంగా సంకల్పించుకోవాలి. నిర్ణిత సమయం ప్రకారం రోజు నడకకు వెళ్లడం వలన శరీరంలోని అధికం గా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. నడక తో పాటు కనీసం 15 నిమిషా లు వ్యాయామం కోసం కేటాయించాలి. ఒక నియమం గా ఇలా చేయడం ప్రారంభిస్తే మానసిక ఉల్లాసం తో పాటు శారీరక ఆరోగ్యం కలుగుతుంది .