నేటి సమాజంలో మనుషుల పరిస్థితి గందరగోలంగా తయారైంది. ఉరుకుల పరుగుల జీవితంతో మరమనుషుల్లాగా మారిపోతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితం మూలంగా మనిషిపై రోజు రోజుకూ వత్తిడి పెరిగిపోతూ వస్తోంది. మరి ముఖ్యంగా ఇలా యాంత్రికంగా పనిచేయడం మూలంగా ప్రజలు ఎన్నో రకాల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా పనితో ఒత్తిడి మూలంగా జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు. ఒక వస్తువును ఒకదగ్గర పెట్టి మరో చోట వెతుకూతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణాలు ఒత్తిడి, ఆందోళలనే చెప్పకోవచ్చు.
అంతేకాకుండా మనిషి యాంత్రిక జీవితంలో ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడటంతో ఇలా జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మిమ్మల్ని కూడా ఒత్తిడి, ఆందోళనలు బాధిస్తున్నాయా. అయితే మీకు కూడా జ్ఞాపక శక్తి సమస్య వచ్చినట్టేనండోయ్.. ఇందుకోసం ఏం చేయాలని తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు.. మీకు సాధ్యమైన కొన్ని చిట్కాలను పాటిస్తే సరి జ్ఞాపక శక్తిని అమాంతం ఇట్టే పెంచేసుకోవచ్చంటున్నారు నిపుణులు.. మరి అవేంటో చూసేయండి..
సమస్యలు లేనటువంటి జీవితం ఎవ్వరికీ ఉండవేమో.. అలా అని ఎవ్వరూ ఒత్తిడితో పనిచేయడం లేదు. అన్ని పనులు చేస్తూనే కొందరూ హాయిగా బ్రతికేస్తుంటారు. కాని కొందరిలో జీవితం ఎలా గడపాలని పనిలో ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి వారే జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కేవలం మీరు ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉన్నట్టయితే మీ జ్ఞాపక శక్తి బేషుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే మనిషి తన జీవితం పట్ల ఎంత సానుకూలంగా, ఉత్సాహంగా ఉంటారో వారి జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తెలుపుతున్నారు.
అయితే మామూలుగా వయస్సు మీద పడిన వారికి జ్ఞాపక శక్తి తగ్గడం సాధారణ విషయమే కాని ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కానటువంటి వారిలో జ్ఞాపక శక్తి తక్కువగా కోల్పోయే అవకాశం ఉంది. సైకాలజికల్ సైన్స్ జర్నల్ లో ప్రచురించబడిన పరిశోధనలో వెయ్య మందిపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే వయస్సు కారణంగా జ్ఞాపక శక్తి తగ్గుతున్నప్పటికీ పాజిటీవ్ యాజిట్యూడ్ ఉన్నవారికి జ్ఞాపక శక్తి నెమ్మదిగా తగ్గుతుందని తెలిపారు. కాగా ఒత్తిడికి గురయినవారు మాత్రం వారి విషయాలను తొందరగా మర్చిపోతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.