Pesticides : పంటలు బాగాపండడానికి పరాగ సంపర్కం జరగాలి. అలా పరాగ సంపర్కం జరగాలంటే పువ్వుల్లో పుప్పొడి రేణువులు ..ఈగలు ఒక మొక్క నుంచి మరొక మొక్కకు తీసుకువెళ్లాలి. ఆ పని చేసేది ఈగ జాతికి చెందిన తుమ్మెదలు, తేనెటీగలే..!పంటల కోసం వాడే పురుగు మందులు తేనెటీగలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుండటంఈ మధ్య కాలంలో బాగా పెరిగింది అని చెప్పక తప్పదు.అనేక రకాల ఈగల జాతికి చెందిన పురుగులు, తుమ్మెదలు, తేనెటీగలు నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్టు రెండు అధ్యయనాలలో తేలడం విశేషం.
నికోటిన్తో తయారైన పెస్టిసైడ్స్, నియోనికోటినాయిడ్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అన్న విషయాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు భ్రమరం ను గమనించడం మొదలు పెడితే ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పెస్టిసైడ్స్ ప్రభావంతో తేనటీగలు, తుమ్మెదల మేత బాగా తగ్గటం, పగలు ఎక్కువగా పడుకుంటూ, రాత్రిపూట నిద్ర లేకుండా ఇవి ఇబ్బంది పడటాన్ని గమనించారు. దీంతో తుమ్మెదల జీవక్రియలు బాగా దెబ్బతిన్నాయి. అయితే ఇది పూలు, పళ్ల మొక్కలు, చెట్ల పరాగ సంపర్కం పై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన పడుతున్నారు.
పరాగ సంపర్కం లో కీలక పాత్ర పోషించే ఇలాంటి తుమ్మెదలు, తేనెటీగలు చురుగ్గా లేకపోవడం వలన పంట దిగుబడి విపరీతంగా తగ్గిపోతుంది . ఇలాంటి హానికారిక క్రిమిసంహారక మందుల వల్ల పరాగ సంపర్కం బాగా తగ్గి పంట దిగుబడి తగ్గటం భవిష్యత్తులో ఆహార కొరతకు దారితీసే ప్రమాదం ఉంది అని తెలియచేస్తున్నారు.అందుకే తేనెటీగలు, తుమ్మెదలు వంటివి ఆరోగ్యంగా ఉండటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరికలు చేస్తున్నారు .
మరి ప్రమాదం అంచున ఉన్న ఇలాంటి జీవుల సంఖ్య తో నే మన ఆహారం ముడిపడి ఉన్నందున వీటికి పరిరక్షణకు సిద్ధం కావలి. గత శతాబ్దం తో పోలిస్తే అమెరికాలోనే కనీసం 30%భ్రమరం జాతి పురుగుల సంఖ్య తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇంచు మించు ఇవే పరిస్థితులు ఏర్పడ్డాయి .
ఈ పెస్టిసైడ్స్ భ్రమరం పిల్లలపై కూడా దుష్ప్రభావం చూపి ఇవి అంతరించిపోతే మానవాళికి ఆహార సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే చీడపీడల నివారణకు మరింత మెరుగైన క్రిమిసంహారక మందులు అభివృద్ధి చేసి, వాటి ప్రభావం తేనెటీగలు వంటివాటిపై పడకుండా చూడాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు.