చాల తేలికగా ఖర్జూరం జీర్ణం అయిపోతుంది.శరీరానికి కావలిసిన శక్తికోసం మరియు శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపడానికి ఇది అమోఘం గాపనిచేస్తుంది.ఖర్జూరం తో పాటు తేనె రోజు తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది.కర్జూరం లో విటమిన్స్ , మినరల్స్ అధికం గా ఉంటాయి.
కర్జూరం తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండడం తో పాటు బలంగా ఉంటాయి.కర్జూరం లోఐరన్, కాల్షియమ్,ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు జింక్ పోషకాలు ఉంటాయి.రోజుకు 3 కర్జూరాలు తినడంవల్ల ఎన్నోప్రయోజనాలతో పాటు శరీరానికి కావలిసిన ఐరన్ కూడా అందుతుంది.కళ్ళకు సoబందించిన రెటినాల్ సమస్య కు ఖర్జురం అద్భుతంగా పనిచేస్తుంది. కర్జూరం లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం లో హెమోగ్లోబిన్ బాగాపెరిగి రక్తనికి సంబందించిన వ్యాధులు మరియు గుండెపోటు రాకుండా ఉంటాయి.ఖర్జురం లో ఉండే కాల్షియం డయేరియాని నివారించడంలో బాగా పనిచేస్తుంది.
కొన్ని కర్జూరాలను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ప్రేగులు శుభ్రపడి మలబద్దకం వదిలిపోతుంది. గర్భిణీ స్త్రీలు ఖర్జురం తినడంవల్ల మంచి లాభం ఉంటుంది. ఖర్జురం తినడంవల్ల రక్తం లో చక్కర స్థాయి సరిగ్గా నిలకడగా ఉంటుంది. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఖర్జురం రోజు తినడం వలన జుట్టు రాలే సమస్యతగ్గి, ఒత్తుగా పెరగడమే కాకుండా మృదువుగా మారుతుంది.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.