ఈ శీతాకాలం లో దొరికే కొన్ని పండ్లు , కూరగాయలు తినడం వలన డయబిటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు డయబిటిస్ ను అదుపు లో ఉంచుతుంది. అయితే ఆ పళ్ళు,కూరగాయలు ఏంటోతెలుసుకుందాం.. జామకాయల లో గ్లైకమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ని పీచు పదార్ధం జీర్ణశక్తి ని మెరుగు చేసి బ్లడ్ షుగర్ స్థాయిని సరిగా ఉంచుతాయి.
సిట్రస్ జాతికి చెందిన , కమలా, నిమ్మ పండ్లు షుగర్ వ్యాధి ఉన్న వారికి మేలు చేసే పండ్ల గా చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రక్తం లో షుగర్ స్థాయి సరిగ్గాఉంటుంది. కమలాపండ్లల్లో గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మధుమేహులకు చాలా మంచిది.ద్రాక్షపండ్లు తినడం వల్ల ఆరోగ్యకర బరువు, ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇందు లోఉండే నారిన్జేనిన్ అనే మూలకం,షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది. అదేవిధంగా రక్త ప్రసరణను కూడా బాగా మెరుగుపరస్తుంది.
తీపి గుమ్మడికాయలు ఫైబర్, పొటాషియం కలిగిఉండడంవలన వాటిని తీసుకుంటే అధిక రక్తపోటుని తగ్గించుకోవచ్చు. ఇందు లోని యాంటీ యాక్సిడెంట్స్ ఇన్సులిన్ స్థాయిలనుసరిగ్గా ఉంచుతాయి. చిలగడదుంపల లో ఫైబర్ , పోషకాలు, బీటా కెరోటిన్ల తో నిండి ఉండడం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. వీటిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. వీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్కి కూడా దూరంగా ఉండొచ్చు.బెంగళూరు క్యాబేజీ ఇదిచూడడానికి చిన్న సైజ్ క్యాబేజీలా ఉంటుంది.ఇది కూడా షుగర్ ఉన్నవారికి మంచి మందులా పని చేస్తుంది. కాబట్టి.. వీటిని ఆహారంలో భాగం గా చేర్చుకోవడం మంచిది.